కోనసీమ: రాష్ట్రంలో దివ్యాంగుల సాధికారికతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఉగాది పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన దివ్యాంగ శక్తి ‘పథకం’ను మంత్రి రామచంద్రపురంలో ప్రారంభించారు.