SKLM: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే నూతన కార్యాలయంలో గురువారం ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. ఇందులో జేసీ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో ఎం కృష్ణమూర్తి, డ్వామా పీడీ సుధాకర్ పాల్గొన్నారు.
కోనసీమ: మండపేట కొత్త బస్టాండ్ వద్ద IFTU ఆధ్వర్యంలో రైస్ మిల్లు కార్మికులతో సమ్మె సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మే 20వ తేదీన జరిగే కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.
కోనసీమ: మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో బీసీ కార్పొరేషన్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పారు.
కృష్ణా: MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గురువారం మచిలీపట్నం వచ్చారు. ఉయ్యూరులో జరిగే ఓ శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మచిలీపట్నం R&B గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. దీంతో పలువురు MRPS నాయకులు మంద కృష్ణ మాదిగను కలిశారు. ముందుగా ఆయన మచిలీపట్నం ఆర్డీవో స్వాతి నివాసానికి వెళ్లి ఆమె ఇచ్చిన తేనేటి విందును స్వీకరించారు.
VZM: బొండపల్లి మండలంలో ఉపాధి పనులకు వెళ్లే వేతనదారుల సంఖ్య పెంచేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతున్నామని ఏపీవో జి అరుణ కుమారి తెలిపారు. గురువారం సాయంత్రం మాట్లాడుతూ.. ప్రస్తుతం 8,124 మంది వేతన దారులు ఉపాధి పనులకు వస్తున్నారని, సంఖ్యను తొమ్మిది వేలకు పెంచాలని ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు లక్ష్యం విధించామన్నారు.
E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం ఇంజనీరింగ్ విభాగ అధికారులతో సమీక్ష సమావేశం కమిషనర్ కేతన్ గర్గ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ నగరంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అన్నారు. లెటర్ ఆఫ్ యాక్సఫ్టన్స్ వారం రోజుల్లో ప్రారంభం కావాలని అన్నారు. ప్రతి ఒక్క అధికారి కూడా తమ వద్దకు వచ్చిన ఫైళ్లను 24 గంటల్లోగా క్లియర్ చేయాలని ఆదేశించారు.
కృష్ణా: ఉగ్రవాదంపై భారత్ పోరు అద్వితీయం అని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. గురువారం సాయంత్రం అవనిగడ్డలో టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో విజయ సింధూరం – జయహో మోదీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ, జనసేన నాయకులు పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి, జయహో భారత్ అంటూ నినదించారు.
NTR: నందిగామ ఏరియా హాస్పిటల్లో ఛైర్మన్ వేపూరి నాగేశ్వరావు, సూపరిండెంట్ డి. వెంకటేశ్వరావు కలిసి మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా యుద్ధమేఘాలు కమ్ముకున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఇలాంటి యుద్ద వాతావరణం వచ్చినప్పుడు పార్టీలన్నీ ఏకమై ఒకటిగా నిలబడాలని కోరారు.
కృష్ణా: గుడివాడ పురపాలక సంఘంలో అన్ని రిజర్వాయర్లకు హెడ్ వాటర్ వర్క్స్లో 24/7 మోటార్లతో పూర్తిస్థాయి మంచినీటి సరఫరా జరుగుతుంది. ఇవాళ కురిసిన అకాల వర్షం కారణంగా హెడ్ వాటర్స్ వర్క్కు వచ్చే పవర్ సప్లైకు అంతరాయం కలిగింది. దీంతో శుక్రవారం పట్టణంలో మంచినీటి సరఫరాకు పూర్తిస్థాయి అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ తెలిపారు.
ASR: హుకుంపేట ఎంపీపీ కూడా రాజుబాబు అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జీవో నెంబరు-3కి ప్రత్యామ్నాయంగా మరో జీవో తీసుకు రావాలని ఎంపీపీ రాజుబాబు, వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, గిరిజన ప్రాంతంలో 100శాతం ఉద్యోగాలు గిరిజనులకే కేటాయించాలని తీర్మానించారు.
VZM: జిల్లా పోలీసుశాఖలో కమ్యూనికేషన్ ఇన్స్పెక్టరుగా పని చేసి, ఉద్యోగ విరమణ చేసిన రమణమూర్తికి SP వకుల్ జిందల్ అతి ఉత్కృష్ట సేవా పతకాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ప్రదానం చేశారు. క్రమశిక్షణతో సంతృప్తి కరంగా విధులు నిర్వహించి, నిస్వార్థంగా సేవలందించే పోలీసు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అతి ఉత్కృష్ట సేవా పతకం అందిస్తుందని SP అన్నారు.
కృష్ణా: జగ్గయ్యపేట మండలంలోని మల్కాపురం గ్రామ సర్పంచ్ అంబోజి పుల్లారావు ( జాన్ ) ఆకస్మికంగా మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గురువారం జాన్ మృతదేహాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. అయన వెంట పట్టణ కూటమినేతలు పాల్గొన్నారు.
ELR: వైసీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిగా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామానికి చెందిన షకీల్ రెహ్మాన్ గురువారం నియమితులయ్యారు. వైసీపీ అనుబంధ విభాగాల నియామకంలో భాగంగా అధినేత వైఎస్ జగన్ రెహ్మాన్ను నియమించారు. పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు గురువారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వాసుబాబు పిలుపునిచ్చారు.
W.G: పెనుమంట్ర మండలం పెనుమంట్ర 2 సచివాలయ పరిధిలో గురువారం ఏఎన్ఎం లక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో ఎన్సీడీ 3.0 సర్వే నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేశారు. అనంతరం సీజనల్ వ్యాధుల గురించి వారికి అవగాహన కల్పించారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా అశ్రద్ధ వహించకుండా తమను సంప్రదించాలని ఏఎన్ఎం లక్ష్మి సూచించారు.
NTR: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు సమాజంలోని ప్రజలకి ఎంతో అవసరమని ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. వత్సవాయి మండలం చిట్యాలలో శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి 14వ వార్షికోత్సవం ఆలయ ధర్మకర్త మారెళ్ల పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.