GNTR: ఫిరంగిపురంలోని ఎరువులు, పురుగుమందుల అమ్మకాల దుకాణాలను గుంటూరు రెగ్యులర్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం. మోహన్ రావు, మండల వ్యవసాయాధికారి వాసంతి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న యూరియా నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యూరియాను విక్రయించాలని స్పష్టం చేశారు.
ELR: ములగలంపల్లి పంచాయతీ పాకలగూడెంలో గ్రామంలో మంచినీటి ట్యాంక్ గుండా రెండు నెలలుగా రంగు మారిన నీరు వస్తుండటంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే నీటిని తాగడంతో పిల్లలు, పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్, పైపులను సిబ్బంది శుభ్రం చేయడం లేదన్నారు. అధికారులు స్పందించి శుద్ధి చేసిన తాగునీరు అందించాలని కోరుతున్నారు.
KRNL: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఖాసిం వలి తీవ్రంగా సోమవారం ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే స్పందించి దాడులు ఆగేలా ఒత్తిడి తీసుకురావాలని, మైనారిటీల భద్రతకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని అయన కోరారు.
తిరుపతి: మహతి ఆడిటోరియంలో Seven Hills High School – Artbeats 2025–26 సాంస్కృతికోత్సవానికి తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యాను. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువుతో పాటు కళలు, సంస్కృతి వ్యక్తిత్వ వికాసానికి అవసరమని పేర్కొన్నారు. అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశ ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు మండల స్థాయిలోని రెవెన్యూ కార్యాలయంలో కూడా అర్జీలు అందించవచ్చని వివరించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారించడం కోసమే ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం కర్ణాటక మైన్స్ మినిస్టర్ మల్లికార్జున్, దావనగేర్ ఎంపీ ప్రభా మల్లికార్జున్తో కలిసి తిరుమలలోని కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కనిగిరి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని స్వామిని వేడుకున్నట్లు ఉగ్ర తెలిపారు.
NTR: ఎలమంచిలిలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాదంలో విజయవాడ వాసి చంద్రశేఖర్ సుందర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి వద్ద ఉన్న బ్యాగులో రూ.5.80 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదంలో ఈ నగదులో కొన్ని నోట్లు పాక్షికంగా కాలిపోయాయి. సోమవారం ఉదయం రైల్వే పోలీసులు ఓ సంచిలో ఈ సొమ్మంతా ప్యాక్ చేసి స్వాధీనం చేసుకున్నారు.
ASR: రంపచోడవరం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు 78 వినతులు వచ్చినట్లు పీవో స్మరన్ రాజ్ తెలిపారు. ప్రధానంగా సీమగండి-వేములకొండ, కుట్రవాడ-పాములేరు గ్రామాల మధ్య రోడ్లు, నూతన పెన్షన్ల కోసం ప్రజలు విజ్ఞప్తి చేశారు. కొన్ని సమస్యలను పీవో తక్షణమే పరిష్కరించగా, మిగిలిన వాటిని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు.
సత్యసాయి: మడకశిర పట్టణం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మడకశిర ఎమ్మెల్యే MS రాజు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మడకశిర పట్టణంలో గతంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిన అభివృద్ధి పనుల పురోగతి గురించి చర్చించారు. పాత విద్యుత్ స్తంభాల మార్పు, కొత్త విద్యుత్ స్తంభాల కోసం ప్రతిపాదనలు పంపాలని విద్యుత్ అధికారులకు సూచించారు.
VZM: నూతన సంవత్సర వేడుకలను జిల్లాలో ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి బహిరంగ ప్రదేశాలు, రహదారులపై వేడుకలు నిర్వహించరాదని, మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామన్నారు.
KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గం జిల్లా కేంద్రం చేయాలని ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి సభ్యులకు కోరారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక TDP కార్యాలయం నందు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా సాధన చేయాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. న్యాయవాది సురేష్, డాక్టర్ దస్తగిరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంతో ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని, ఆ దిశగా వినూత్న రీతిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులకు సూచించారు. ఒకే సమస్యపై ఫిర్యాదులు పలుమార్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే వినతులకు నా...
ASR; జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ అమిత్ బర్దార్, పోలీసు అధికారులతో వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని ఎస్పీ తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం కేసులు తగ్గాయన్నారు. ఈ ఏడాది 135 ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయని, 14,484.38 కిలోల గంజాయి, 35.61 కిలోల హషీస్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
VZM: విజయనగరం పట్టణం దాసన్నపేటలోని అతి పురాతన శ్రీ చిన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతన కవచధారణ మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ అరవెల్లి రామాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 108 మంది మహిళలచే ప్రత్యేక దీపారాధన నిర్వహించారు.
కృష్ణా: చదువులో మర్మం గ్రహించే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులవుతారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం చల్లపల్లిలో 800 మంది టెన్త్ విద్యార్థులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు విద్య మాత్రమే సాధనమని ఆయన తెలిపారు. టెన్త్ ఫలితాల్లో కృష్ణా జిల్లా ఐదో స్థానం సాధించాలని డీఈవో యూవీ సుబ్బారావుకు సూచించారు.