• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయనిది చెక్కు అందజేత

AKP: ఎస్ రాయవరం మండలం గుడివాడకు చెందిన మల్లపురాజు సత్యనారాయణ రాజుకు సీఎం సహాయ నిధి చెక్కు మంజూరు అయింది. ఈ మేరకు మండల టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, పార్టీ నాయకులు వెంకటరాజు, కోడ లోవరాజు, సుంకర శ్రీనివాసరావు ఇవాళ లబ్ధిదారుడికి రూ.53,284 చెక్కును అందజేశారు. అబద్ధం మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి ‌కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

March 20, 2026 / 12:39 PM IST

పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2కి వాయిదా

E.G: ఈ నెల 21 శనివారం జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా పడినట్లు మండపేట మండల విద్యా శాఖాధికారి నాయుడు రామచంద్రరావు శుక్రవారం తెలిపారు. రంజాన్ పండుగ సెలవు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు. ఏప్రిల్ 2న యథావిధిగా పరీక్ష నిర్వహిస్తామన్నారు.

March 20, 2026 / 12:37 PM IST

‘అక్రమ వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి’

W.G: నరసాపురంలో అక్రమ వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా నాయకుడు కవురు పెద్దిరాజు శుక్రవారం డిమాండ్ చేశారు. బాధితురాలు రమణతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పు తిరిగి చెల్లిస్తామన్నా.. బంగారం ఇవ్వడం లేదని ఆరోపించారు. వడ్డీ వ్యాపారులకు వత్తాసు పలుకుతున్న నరసాపురం రూరల్ CI దుర్గా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

March 20, 2026 / 12:37 PM IST

కాలువలో వృథాగా సాగునీరు పారుదల

NDL: సంజామల మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సార్ బీసీ కాలువలో సాగునీరు వృథాగా పారుతోంది. పదో బ్లాక్ కాలువ వద్ద కృష్ణా జలాలు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం పంటలు నూర్పిడి దశలో ఉండటంతో నీటి అవసరం లేకపోయినా సరఫరా కొనసాగుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి వినియోగాన్ని సమర్థంగా నిర్వహించాలని కోరుతున్నారు.

March 20, 2026 / 12:33 PM IST

డైరీలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

సత్యసాయి: ఉగాది పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నూతన తెలుగు కాల పట్టిక, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో MLA కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని డైరీలను విడుదల చేశారు. హిందూ సంప్రదాయాలను, కాల గణనను ప్రజలకు చేరువ చేయడంలో వీహెచ్‌పీ కృషి అభినందనీయమని కొనియాడారు. కార్యకర్తలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 20, 2026 / 12:31 PM IST

జాబ్ క్యాలెండర్‌పై ఎమ్మెల్యే హర్షం

ELR: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై ఏలూరు MLA బడేటి చంటి శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని YCP నేతలు అడ్డుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

March 20, 2026 / 12:30 PM IST

‘గిరిజన హాస్టల్లో వసతులకు నిధులు కేటాయించండి’

NLR: నెల్లూరుకు వచ్చిన జాతీయ ST. కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యని నెల్లూరు ZP కార్యాలయంలో TDP నాయకుడు గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్గామిట్ట ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో తరగతి గదులు నిర్మించేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.  పరిశీలిస్తామని హామీ ఇచ్చారు

March 20, 2026 / 12:28 PM IST

అయినంపూడిలో గంగానమ్మ గుడి వద్ద ఉద్రిక్తత

కృష్ణా: పామర్రు పరిధిలోని అయినంపూడిలో గంగానమ్మ గుడి సమీపంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శుక్రవారం నిరసన చేపట్టారు. ఆక్రమణను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దళితుల కులదైవమైన గంగానమ్మ గుడిని తొలగిస్తుండగా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై చర్యలు ఎందుకు లేవని అధికారులను ప్రశ్నించారు. తహసీల్దార్ వచ్చేవరకు వెళ్లేది లేదంటూ బైఠాయించారు.

March 20, 2026 / 12:27 PM IST

విద్యుత్ షాక్ బాధితులకు రూ.10 లక్షల సాయం

గుంటూరు: జూపూడిలో విద్యుత్ షాక్‌తో తల్లి, కుమార్తె మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. MLA ధూళిపాళ్ల చొరవతో APCPDCL ద్వారా మంజూరైన రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని శనివారం బాధితులకు అందజేశారు. పట్టణంలోని TDP కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు MLA ఈ చెక్కులను పంపిణీ చేశారు.

March 20, 2026 / 12:25 PM IST

గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన యువకులు

ASR: రాజవొమ్మంగికి చెందిన కొంతమంది యువత సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో గంజాయి రవాణాకు పాల్పడుతున్నారు. ఇటీవల వారిలో కొంతమందిని గంజాయితో చెన్నై, జడ్డంగి పోలీసులు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొంతమంది ఇలాంటి ఘటనలకు పాల్పడడం పరిపాటిగా మారుతోంది. 3 నెలల కాలంలో 8 మంది యువత గంజాయి కేసుల్లో పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.

March 20, 2026 / 12:20 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.

EG: దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదేశాల మేరకు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూచిపూడి శ్రీనివాస్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు .వైద్య ఖర్చుల నిమిత్తం లబ్దిదారులైన దాసరి సత్య కోటేశ్వరరావుకు రూ.2,50,000/-చెక్కును శుక్రవారం అందజేశారు. సర్పంచ్ నాయుడు దుర్గాప్రసాద్, జనరల్ సెక్రటరీ చెల్లిoకి వాసు తదితరులు పాల్గొన్నారు

March 20, 2026 / 12:17 PM IST

గరికపాటి వాక్యాలు వెనక్కి తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్

GNTR: గరికపాటి నరసింహా రావు ఇటీవల పాఠశాల విద్యార్థుల గురించి చేసిన వ్యాఖ్యలను AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ జీ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గరికపాటి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

March 20, 2026 / 12:14 PM IST

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఇబ్రహీంబాద్‌కు చెందిన చిన్నారి చికిత్సకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.3,89,228 చెక్కును మంజూరు చేపించారు. ఇవాళ ఎమ్మెల్యే తన కార్యాలయంలో బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన సహాయం అందించడం తమ బాధ్యత అని తెలిపారు. స్థానిక నాయకులు ఉన్నారు.

March 20, 2026 / 12:10 PM IST

‘సాంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు రథసారదలు అవ్వాలి’

VZM: సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కవులు, కళాకారులు సాహితి వేత్తలు రథసారదులవ్వాలని పూర్వ నేషనల్ న్యాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి సత్యనారాయణ పిలుపునిచ్చారు. చైతన్య భారతి 380వ సభకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. కళా రంగంలో 40 ఏళ్లగా చేసిన సేవలకు బుర్రకథ కళాకారుడు పిరిడి జగన్నాథముకు ‘బుర్రకథ స్టార్ జూనియర్ కుమ్మర మాస్టర్’ బిరుదును ప్రధానం చేశారు.

March 20, 2026 / 12:03 PM IST

వైసీపీపై పరిటాల రాము నిప్పులు చెరిగాడు,

ఎన్టీఆర్: కీసరలో పరిటాల కోటేశ్వరరావు (రాము) మీడియా సమావేశంలో వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో రేషన్ మాఫియా జరిగిందని, పనికిరాని భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చారని విమర్శించారు. శ్రీకృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోగంటి సత్యనారాయణకు జడ్పీటీసీ భర్త వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

March 20, 2026 / 12:02 PM IST