సత్యసాయి: పెనుకొండ పట్టణంలో ఆర్అండ్బి గెస్ట్ హౌస్లో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ సమక్షంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేశ్ సోమవారం ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, సీపీఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు సమక్షంలో ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ATP: అనంతపురంలోని చెరువు కట్టపై వెలసిన అయ్యప్ప స్వామి ఆలయంలో కేరళ సాంప్రదాయ పద్ధతిలో విషు పండుగ నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు MLA బండారు శ్రావణి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చకున్నారు. అర్చకులు ఆమెను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించినట్లు ఆమె తెలిపారు.
సత్యసాయి: పెనుకొండ నూతన డీఎస్పీగా నరసింగప్ప సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. సబ్ డివిజన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. డివిజన్ పరిధిలో ఉన్న పోలీసుల సహకారంతో సామాన్య మానవునికి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ రత్నను నూతన డీఎస్పీ కలిశారు.
సత్యసాయి: సోమందేపల్లిలోని దుర్గా నగర్లో మురుగు కాలువలు లేక రోడ్లపైకి నీళ్లు పారుతున్నాయి. మురుగు నీరు రోడ్లపైకి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే మురుగు నీరు పోవడానికి కాలువలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ASR: గ్రామాల్లో నెలకొన్న సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ సూచించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం రాజేంద్రపాలెంలో సర్పంచ్ సింహాచలం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ATP: గుత్తి మున్సిపాలిటీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను చెల్లింపుకు ఈనెల 30 వరకు 50 శాతం రాయితీతో ఇంటి పన్ను చెల్లించవచ్చని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరం ఇంటి పన్ను చెల్లించని వారు ఈనెల 30 లోపల 50% వడ్డీ రాయితీతో చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.
PLD: దుర్గి మండలంలోని ధర్మవరం గ్రామంలో సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళితబహుజన ఫ్రంట్ పల్నాడు జిల్లా జనరల్ సెక్రటరీ వడ్డె మధు సూదనరావు పాల్గొని మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేర్కొన్నారు.
TPT: అంబేద్కర్ అవతార పురుషుడని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు. సత్యవేడులో సోమవారం జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వల్లే రాష్ట్రంలో 31 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగు పెట్టారని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు
NDL: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్కు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం నాడు నివాళులర్పించారు. బనగానపల్లె పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఆయన అన్నారు.
PPM: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ముంబైలోని చైత్య భూమి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు మరువరానివని అన్నారు.
సత్యసాయి: కొత్తచెరువు మండలం బండ్లపల్లి గ్రామంలో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన బండి వినోద్ కుమార్తె బండి రిషికా (9) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. కష్టకాలంలో తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ASR: కొయ్యూరు మండలం మంపలో ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ నుంచి సిగ్నల్స్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు ఆవేదన చెందారు. తరచూ సిగ్నల్స్ రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. నెలలో వారం రోజులు కూడా సిగ్నల్ ఉండడం లేదన్నారు. తమను ఆర్ధిక దోపిడీ చేస్తున్న బీఎస్ఎన్ఎల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సోమవారం మంప ఎస్సై కే.శంకరరావుకు ఫిర్యాదు చేశారు.
BPT: ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరగనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రాలను బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సోమవారం ఆవిష్కరించారు. అగ్ని ప్రమాద నివారణ, సురక్షిత పద్ధతులపై అవగాహన కల్పించే ఈ వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
VZM: డా. బీఆర్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో జయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్య ద్వారానే అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చునని స్పష్టం చేశారు. దీనికి అంబేద్కర్ మహనీయుని జీవితమే ఉదాహరణ అన్నారు.
VZM: విజయనగరం, కంటోన్మెంట్ రెల్లివీధిలో జరిగిన బాబాసాహెబ్ 134వ జయంతి వేడుకలకు జనసేన నాయకులు అవనాపు విక్రమ్ ముఖ్యఅతిథిగా హాజరై రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావిభారత నిర్మాణంలో ముఖ్యమైన రాజ్యాంగ నిర్మాణ బృందంలో అంబేద్కర్ కీలకంగా వ్యవహరించారని, ఆయన ఆశయాలు యువతకు మార్గదర్శకాలన్నారు.