• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మానవుల జీవన విధానానికి మెక్కలే ప్రాణాధారం

VZM: నేటి మానవుల జీవన విధానానికి మొక్కలే ప్రాణధారమని శ్రీ సాయి కృష్ణా వాకర్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు తాడ్డి ఆదినారాయణ అన్నారు. బుధవారం స్థానిక జగదాంబ నగర్‌, గురజాడ అప్పారావు కాలనీలో ఆయన మొక్కలను పంపిణీ చేశారు. ముఖ్య అతిది డిస్ట్రిక్ట్‌ 102 ఎలక్ట్‌ గవర్నర్‌ ఎ.తిరుపతి రావు మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు.

September 10, 2025 / 02:47 PM IST

‘గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు’

VZM: వెలకట్టలేని విజ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు అని ఏపీ గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.చంద్రశేఖర కల్కూర పేర్కొన్నారు. విద్యార్ధులు`గ్రంథాలయాల ఆవశ్యకత అనే పేరుతో ఏర్పాటు చేసిన సదస్సును సీతం కళాశాల డైరక్టర్‌ డా ఎం.శశిభూషణరావు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. అధ్యక్షులు గురుప్రసాద్‌ మాటాడుతూ.. గ్రంథాలయాలను విద్యార్ధులు వినియోగించుకోవాలన్నారు.

September 10, 2025 / 02:46 PM IST

రూ.10 లక్షల వ్యయంతో మరమ్మత్తు పనులు: ఎస్పీ

GNTR: తుళ్లూరులో APSP పోలీసులకు వసతి గృహానికి సంబంధించి CSR ఫండ్స్ ద్వారా రూ.10 లక్షల వ్యయంతో మరమ్మత్తు పనులు చేశామని బుధవారం జిల్లా SP సతీష్ పేర్కొన్నారు. తుళ్లూరులో ఖాళీగా ఉన్న బిల్డింగ్ గురించి CRDA అధికారులకు తెలపడంతో సానుకూలంగా స్పందించి బిల్డింగ్ పోలీసులకు కేటాయించారని చెప్పారు. ఇందులో సోలార్ పనులు పెండింగ్ ఉన్నాయని పేర్కొన్నారు.

September 10, 2025 / 02:46 PM IST

‘బాలికల హక్కుల పట్ల అవగాహన అవసరం’

SKLM: బాలికల హక్కులను కాపాడేందుకు అనేక చట్టాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ పీఓ శోభారాణి తెలిపారు. బుధవారం నరసన్నపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈనెల రెండవ తేదీ నుండి 12వ తేదీ వరకు సంకల్పం పేరిట అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు.

September 10, 2025 / 02:42 PM IST

తెనాలిలో ఘనంగా డా. నాయుడమ్మ జయంతి

GNTR: ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్. యలవర్తి నాయుడమ్మ జయంతిని బుధవారం తెనాలిలో నిర్వహించారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ & టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెంచుపేటలోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపాటి రఘునాధ బాబు, వైస్ ఛైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం పలువురు పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

September 10, 2025 / 02:41 PM IST

‘రైతులందరికీ అవగాహన కలిగించాలి’

కృష్ణా: జిల్లాలో అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరిగి యూరియా లభ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం మచిలీపట్నంలో మాట్లాడుతూ.. యూరియా సరఫరా, పంపిణీపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. గ్రామాల్లో ఇంటింటికి యూరియా సరఫరా నిరంతరం జరుగుతుందని పేర్కొన్నారు.

September 10, 2025 / 02:40 PM IST

కందుకూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

NLR: కందుకూరులోని పామూరు రోడ్డులో త్యాగరాజ స్వామి గుడి ఎదురుగా ఉన్న మున్సిపాలిటీ షాపు మెట్లపై గుర్తు తెలియని ఒక వ్యక్తి డెడ్ బాడీ కనిపించింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకున్నది. చుట్టుప్రక్కల స్థానికులు ఆ డెడ్ బాడీని పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

September 10, 2025 / 02:39 PM IST

డిప్యూటీ సీఎం ఫోటోపై హైకోర్టు కీలక తీర్పు

KKD: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి వై. కొండలరావు వేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో వేసినట్లుగా ఉందని, కోర్టు సమయాన్ని వృధా చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో జనసేన నాయకులలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

September 10, 2025 / 02:37 PM IST

ఎలమంచిలిలో జనవాణి కార్యక్రమం

AKP: ఎలమంచిలి పట్టణం జడ్పీ అతిథి గృహంలో బుధవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వీటిని పరిశీలించిన ఆయన పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారని తెలిపారు.

September 10, 2025 / 02:36 PM IST

‘ప్రమాదంలో గాయపడిన వ్యవసాయ కూలీలను ఆదుకోండి’

అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యవసాయ కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఇవాళ మదనపల్లె నుంచి ముదివేడుకు టమోటో కోత కోసేందుకు వెళుతున్న 11 మంది కూలీలు గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. CPM నాయకులు వారిని పరామర్శించారు. ఉపాధి హామీ పనులు అమలు చేయాలని కోరారు.

September 10, 2025 / 02:34 PM IST

వెంకటగిరిలో పోలేరమ్మ జాతర.. ముఖ్య ఘట్టాలివే

TPT: శక్తి స్వరూపిణి వెంకటగిరి పోలేరమ్మ జాతర మొదలైంది. ఇవాళ పీఠ పూజ చేసి అమ్మవారి ప్రతిమను తయారు చేసేందుకు మట్టిని సేకరిస్తారు. మట్టితో బొమ్మను తయారు చేస్తారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారి ప్రతిమ తయారీ జరుగుతుంది. అనంతరం జినిగలవారి వీధిలోని చాకలివారి మండపానికి అమ్మవారిని తీసుకొచ్చి దిష్టి చుక్క పెడతారు. అక్కడి నుంచి ఆలయానికి తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు.

September 10, 2025 / 02:31 PM IST

ఎల్లార్తిలో 13 మందిపై బైండోవర్

KRNL: ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలోని ఎల్లార్తి గ్రామానికి చెందిన 13 మందిపై ఎస్సై గురజాల దిలీప్ కుమార్ బైండోవర్ కేసు నమోదు చేసినట్లు బుధవారం తెలిపారు. ఈ నెల 18 నుంచి 20 వరకు జరగనున్న ఉరుసు నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా వీరిని బైండోవర్ చేసి తహసీల్దార్ సమక్షంలో హాజరుపరిచారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

September 10, 2025 / 02:30 PM IST

‘తురకపాలెం వరుస మరణాలపై అధ్యయనం’

GNTR: జిల్లాలోని తురకపాలెంలో వరుస మరణాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని బుధవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి కారణాలు తెలుసుకుంటామన్నారు. ‘ఐసీఏఆర్ టీమ్ ఇక్కడ పర్యటించింది. ఇప్పటికే మట్టి, తాగునీటి శాంపిల్స్ సేకరించింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక ఇవాళ వస్తుందని మంత్రి తెలిపారు.

September 10, 2025 / 02:29 PM IST

అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కమిషనర్

NLR: నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ బుధవారం స్థానిక రామలింగాపురం అండర్ బ్రిడ్జి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలోపు నాణ్యతతో పూర్తిచేసి మార్గాన్ని ప్రజా రవాణాకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.

September 10, 2025 / 02:28 PM IST

‘నిత్యవసరాల డిపోలు సక్రమంగా నిర్వహించాలి’

VSP: తగరపువలసలో ప్రభుత్వ నిత్యావసర వస్తువుల డిపోలు సక్రమంగా నిర్వహించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ భీమిలి ఏరియా సమితి వినతిపత్రం సమర్పించింది. CPI జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.పైడిరాజు మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నత్తనడకన సాగుతోందని వేగవంతం చేయాలని కోరారు. డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్కి సీపీఐ నాయకులు వినతిపత్రం ఇచ్చారు.

September 10, 2025 / 02:27 PM IST