KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన లా మూడేళ్ల కోర్సులో 6వ సెమిస్టర్, ఐదేళ్ల కోర్సులో 10వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఫలితాల కోసం రాయలసీమ యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ను సందర్శించాలని గురువారం తెలిపారు.
అన్నమయ్య: మండల సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వెంకటేశులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుర్రంకొండ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సీతమ్మ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.
VZM: మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని టాస్క్ ఫోర్స్ సీఐ బంగారు పాప సూచించారు. స్థానిక జమ్ము నారాయణపురం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మత్తుకు అలవాటు పడితే జీవితం అస్తవ్యస్తంగా మారుతుందన్నారు. ప్రస్తుతం చట్టాలు కూడా కఠినంగా ఉన్నాయని వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు.
కోనసీమ: జెడ్.మేడపాడు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్గా నియమితులైన సలాది బాల సుబ్రహ్మణ్యం మంగళవారం మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో పీఎసీఎస్ ఛైర్మన్గా నియమించిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను దుశ్శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.
VSP: జిల్లాలో చిన్నపాటి వర్షానికే ఫుట్ పాత్ కుంగిపోయిన ఘటన విశాఖలో మంగళవారం చోటుచేసుకుంది. ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్డులో కొద్దీ రోజులుగా భూగర్భ విద్యుత్ కేబుల్ పనుల చేస్తున్నారు. ఫుట్ పాత్ను ఆనుకుని తవ్వడంతో మట్టి జారిపోయి సుమారు వంద మీటర్ల మేర టైల్స్ పక్కకు ఒరిగిపోయాయి. ప్రస్తుతం పాదచారులు ఫుట్ పాత్పై నడిచే వీలు లేకుండా పోయింది అని అసహనం వ్యక్తం చేశారు.
NLR: కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసి నెల్లూరు జిల్లాని అగ్రస్థానంలో నిలపాలని పార్లమెంటరీ దిశా కమిటీ ఛైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. పథకాల అమలులో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
TPT: ఫేస్బుక్లో ‘వైష్ణవ యాత్రాస్’ పేరిట ప్రభాకరాచార్యులు ఓ పేజీ నడుపుతున్నారు. శ్రీవారి అభిషేకం, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్, రూ.300 దర్శన టిక్కెట్లు ఇస్తామంటూ అతను ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటి నకిలీ వ్యక్తులు, వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ సూచించింది. టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు తెలిపింది.
SKLM: మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లో మంగళవారం కార్గో ఎయిర్ పోర్టు సర్వే బృందాలు సర్వే చేయడానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అడ్డుకోవడంతో సర్వే చేపట్టేందుకు వచ్చిన సర్వే బృందాలు తిరిగి వెళ్లిపోయాయి.
NDL: పీఎం సూర్య ఘర్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని.. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముక్త్ బిజిలి యోజన పథకం కింద సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు వందమంది దరఖాస్తుదారులకు స్టేట్ బ్యాంక్ మంజూరు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
KKD: కులాల మధ్య చిచ్చుపెట్టే వర్గీకరణ ఆలోచన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విరమించుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా. ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. మంగళవారం కాకినాడలోని శాంతిభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 1935లో నాటి రాజ్యాంగం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వమే ఈ ఎస్సీ, ఎస్టీ గ్రూపులను విభజించ కూడదని పేర్కొందని గుర్తు చేశారు.
కోనసీమ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ని మంగళవారం విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో బాధ్యతలు స్వీకరించి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అమలాపురంకి చెందిన బీజేపీ నేతలు కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్, సోషల్ మీడియా నాయకులు యనమదల వెంకటరమణ పాల్గొన్నారు. మాధవ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
TPT: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి విహరించి భక్తులను ఆశీర్వదించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై స్వామివారు విహరించారు.
KKD: సాధారణ బదిలీల్లో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీగా నియమితులైన జీవీ రామచంద్రరావు మంగళవారం కాకినాడలో ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ ఆయనకు పలు సూచనలు చేశారు.
NTR: స్త్రీ నిధి తదితరాల ద్వారా పొందిన రుణాలను తప్పనిసరిగా జీవనోపాధి కార్యకలాపాలకు, సంపద సృష్టికి సద్వినియోగం చేసుకొని, ఆర్థిక వృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జీవనోపాధులుపై సమావేశం జరిగింది. కుటుంబ ...
SKLM: కర్నూల్లో 28,29 తేదీల్లో జరిగిన అండర్-18 మహిళా రగ్బీ టోర్నీలో తిరుమల జూనియర్ కాలేజ్, శ్రీకాకుళం విద్యార్థినులు బి.గీతిక, కే.షాలిని పాల్గొన్నారు. బి.గీతిక ఉత్తమ ప్రతిభ కనబరిచి నేషనల్ లెవెల్కు ఎంపిక కాగా, షాలిని స్టేట్ లెవెల్లో మెడల్ సాధించింది. ప్రిన్సిపాల్ వి.టి. నాయుడు, డైరెక్టర్లు, ఏఓ వీరిని సన్మానించారు.