• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పీజీ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు విడుదల

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జనవరి 2025లో నిర్వహించిన M.com 1,3వ,MA. రాజనీతి శాస్త్రం, చరిత్ర, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలన్నారు.

September 10, 2025 / 04:27 PM IST

‘రణభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి’

KRNL: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారానికై UTF ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 19 వరకు జరిగే రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని UTF మండల అధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు శంకరయ్య బుధవారం పిలుపునిచ్చారు. పెద్దకడబూరు ZPHS నందు రణభేరి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. యాత్ర 15న కర్నూలు నుంచి ప్రారంభమై ఎమ్మిగనూరు చేరుకుంటుందన్నారు.

September 10, 2025 / 04:26 PM IST

గుడివాడకు కీలకంగా మారిన రైల్వే జంక్షన్

కృష్ణా: గుడివాడలో రైల్వే జంక్షన్ దక్షిణ మధ్య రైల్వేలో ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఇది విజయవాడ, మచిలీపట్నం, భీమవరం వైపు ప్రయాణించాలంటే కీలకంగా మారింది. గుడివాడకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉంది. అనేక ముఖ్యమైన నాయకులు ఇక్కడి నుండే ఎన్నికయ్యారు. వరి, పత్తి, వంటి పంటలను రైతులు గుడివాడ చుట్టుపక్కల సాగు చేస్తారు. విద్యా వాణిజ్య రంగాల్లో గుడివాడ కేంద్రంగా మారింది.

September 10, 2025 / 04:25 PM IST

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ 2025లో గీతం ఫార్మసీకి 33వ ర్యాంక్‌

VSP: గీతం డీమ్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, బోధన-పరిశోధనలలో అత్యున్నత ప్రమాణాలకు గుర్తింపుగా ఎన్ఐఆర్ఎఫ్ 2025 ర్యాంకింగ్ దేశవ్యాప్తంగా 33వ స్థానంలో నిలిచింది. గతేడాది 48వ ర్యాంక్ నుంచి మెరుగైందని ప్రిన్సిపాల్ ఎల్.శ్రీనివాస్ బుధవారం తెలిపారు. పేటెంట్లు, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురణలు, పరిశోధకుల కృషి ఈ విజయానికి కారణమని అధికారులు పేర్కొన్నారు.

September 10, 2025 / 04:24 PM IST

‘నాటు సారా నిర్మూలనకు సహకరించాలి’

PPM: నాటుసారా నిర్మూలనలో భాగంగా చేపట్టిన నవోదయం 2.0 కార్యక్రమాన్ని పాలకొండలో నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ సూర్యకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాను, నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ మల్లేశ్వరి, ఎస్సై ప్రయోగమూర్తి పాల్గొన్నారు. సారా నిర్మూలనకు అందరూ సహకరించాలని సూచించారు.

September 10, 2025 / 04:24 PM IST

‘డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి’

ELR: గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరుతూ ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్‌కు బుధవారం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వెల్లమెల్లి శివారు చింతాయిగూడెంలో డ్రైనేజీ సమస్య ఉందని జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడంలేదని శ్రీను ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు పట్టించుకోవడం లేదన్నారు.

September 10, 2025 / 04:20 PM IST

సీఎంకు జ్ఞాపికను అందజేసిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్

అనంతపురంలో జరుగుతున్న ‘సూపర్ సిక్స్- సూపర్ హిట్’ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కూడా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సభలో జేసీ అభిమానులు భారీగా పాల్గొన్నారు.

September 10, 2025 / 04:20 PM IST

విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు

E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరుకి చెందిన బెందాడి శాంతిప్రియ(21) అదృశంపై ధవళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. ధవలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న శాంతిప్రియ ఈనెల 9న కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం తండ్రి నూకరాజు ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

September 10, 2025 / 04:20 PM IST

కట్ట పుట్టాలమ్మను దర్శించుకొన్న తుడా ఛైర్మన్

TPT: రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ దొడ్లమిట్ట గ్రామంలో వెలిసిన కట్టపుట్టాలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఇవాళ తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి జాతరలో పాల్గొని కట్టపుట్టాలమ్మను దర్శించుకుని మొక్కోలు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు తుడా ఛైర్మన్‌ని ఘనంగా ఆహ్వానించి అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

September 10, 2025 / 04:20 PM IST

లక్ష్మణేశ్వరం సొసైటీ ఛైర్మన్‌గా చాగంటి

W.G: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌గా జనసేన నాయకుడు చాగంటి పార్థసారథి నియమితులయ్యారు. సభ్యులుగా దొంగ రామలక్ష్మి, గుండుబోయిన రాంబాబులను నియమిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. సొసైటీ అభివృద్ధికి కృషి చేసి రైతులకు అత్యుత్తమ సేవలు అందిస్తానని పార్థసారథి తెలిపారు.

September 10, 2025 / 04:19 PM IST

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

PPM: అగ్ని ప్రమాదాల నివారణపై పాలకొండ అగ్నిమాపక శాఖ ఎస్సై సర్వేశ్వరరావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. సీతంపేట మండలం బుడగరాయిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా రక్షించుకోవాలి, ఇతరులను ఎలా రక్షించాలో వివరించారు.

September 10, 2025 / 04:19 PM IST

జిల్లాలో పలువురు పోలీసు సిబ్బంది బదిలీ

KDP: జిల్లాలో 44 మంది పోలీసు సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టినట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. తక్షణం ఉత్తర్వలు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. మరో 11 మంది సిబ్బందిని వివిధ చోట్ల అటాచ్ చేశారు. బదిలీ అయిన వారిలో పలువురు ASIలు, PCలు, WPCలు ఉన్నట్లు తెలిపారు.

September 10, 2025 / 04:17 PM IST

తిరుపతిలో ISPS డేటా సైన్స్ సెంటర్ ప్రారంభం

TPT: నలందానగర్‌లో ఏర్పాటు చేసిన ISPS డేటా సైన్స్ సెంటర్, సి. రావు సెమినార్ హాల్‌ని ఇవాళ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. స్టాటిస్టిక్స్ కన్సల్టెన్సీ సెల్, ప్రొఫెసర్ పి.సి. మహలనోబిస్ కంప్యూటర్ లాబొరేటరీ,సెల్ఫ్ స్టడీ లైబ్రరీ, రూఫ్ గార్డెన్‌ని సందర్శించారు. స్టడీ లైబ్రరీలో విద్యార్థుల వసతుల గురించి ప్రెసిడెంట్ రాజశేఖరరెడ్డి కలెక్టర్‌కి వివరించారు.

September 10, 2025 / 04:17 PM IST

యూరియా విక్రయాలు పరిశీలించిన కలెక్టర్

కృష్ణా: కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం మధ్యాహ్నం చల్లపల్లి మండలం లక్ష్మీపురం పీఏసీఎస్ వద్ద యూరియా విక్రయాలను ఆకస్మికంగా పరిశీలించారు. యూరియా సరఫరా వివరాలు నమోదు చేయాలని, యూరియా పొందిన రైతుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణమోహన్, ఏవో కే.మురళీకృష్ణ, సొసైటీ సీఈవో లంకపల్లి రమేష్, వీఆర్వో తూము శ్రీనివాసరావు పాల్గొన్నారు.

September 10, 2025 / 04:14 PM IST

మానేపల్లిలో ఆకస్మిక వర్షం

ప్రకాశం: పుల్లలచెరువు మండలం మానేపల్లిలో ఇవాళ మధ్యాహ్నం ఆకస్మికంగా గాలులు వీస్తూ వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఎండలతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. పొలాలకు వెళ్లిన రైతులు ఎండల తీవ్రతతో ఉక్కపోతకు గురయ్యారు, కానీ చల్లటి గాలులు వీయడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

September 10, 2025 / 04:12 PM IST