అన్నమయ్య: రాయచోటి మండలం చెన్నముక్కపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో టీడీపీ యువనేత మౌర్యా రెడ్డి పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉర్దూ పాఠశాల ఏర్పాటు, నీటి సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
NDL: పాణ్యం మండలలో ప్రజా సమస్యల వేదికలో NSUI జిల్లా అధ్యక్షుడు బత్తిని ప్రతాప్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి వినతిపత్రం అందజేశారు. జిందాల్ రహదారిపై బొగ్గు లారీల దుమ్ము వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శుక్రవారం తెలిపారు. అలాగే పాణ్యం బస్టాండ్లో బస్సులు ఆపకపోవడం సమస్యను వివరించారు. ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేసి త్వరలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
AKP: సంపద కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందని ఎస్ రాయవరం మండలం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం చినగుమ్ములూరు సంపద కేంద్రాన్ని సందర్శించి తయారైన సేంద్రియ ఎరువును పరిశీలించారు. దీనిని విక్రయించి వచ్చే ఆదాయాన్ని పంచాయతీకి జమ చేయాలన్నారు. క్లాప్ మిత్రలు ప్రతిరోజు చెత్తను సేకరించి సంపద కేంద్రానికి తరలించాలన్నారు.
E.G: కొవ్వూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రజా దర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుంచి పలు సమస్యలకు సంబంధించి ఆర్జీలను స్వీకరించారు. తక్షణమే పరిష్కారం చూపే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో చౌటపల్లి సూ...
అనంతపురం మార్కెట్ యార్డులో ఈనాం విధానం అమలు కాకుండానే సరుకు లోడింగ్ చేయడంపై చైర్పర్సన్ బల్లా పల్లవి అధికారులను ప్రశ్నించారు. ఆన్లైన్ వ్యవస్థ ప్రారంభం కాకముందే, సరుకు ధర నిర్ణయించకుండా లోడింగ్ ఎలా చేస్తారని నిలదీశారు. రైతులకు ధర విషయంలో స్పష్టత ఉండాలని, పారదర్శకత లేని విధానాల వల్ల సాగుదారులు నష్టపోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ASR: గంజాయి నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.1లక్ష జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి గౌరీశ్వరరావు శుక్రవారం తెలిపారు. పాడేరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2014లో 360 కిలోల గంజాయి తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారన్నారు. ఇందులో ఏ-2 నిందితుడైన రాజమండ్రి ప్రాంతానికి చెందిన నాయుడు శ్రీనివాస్ అనే వ్యక్తికి శిక్ష పడిందన్నారు.
KRNL: డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుకు మద్దతు ఇస్తున్నారని జగన్పై సమతా సైనిక్ దళ్ తీవ్ర విమర్శలు చేసింది. దళితుల ప్రాణాలకు విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని ఇవాళ రంగయ్య ఆరోపించారు. నిందితుడిని చట్టానికి అప్పగించకపోతే తాడేపల్లి కేంద్ర కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకుని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
BPT: పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా సంతమాగులూరులో పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ఎంపీడీవో జ్యోతిర్మయి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామాల పరిశుభ్రత, అభివృద్ధిలో వారి కృషి ముఖ్యమని తెలిపారు. అనంతరం గ్రీన్ అంబాసిడర్లకు శాలువాలు కప్పి గౌరవించారు.
ప్రకాశం: దిగువమెట్ట తండాలో గిరిజనులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డిను కలిసి తమకు అటవీ హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వందల ఏళ్లుగా అడవిపై ఆధారపడి జీవిస్తున్న తమపై అటవీశాఖ ఆంక్షలు విధించడం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2013లో ఇచ్చిన 5 ఎకరాల భూమి హామీ అమలు కాలేదని చెప్పుకొచ్చారు.
NLR: రాష్ట్రంలో 706 ఆలయాలను రూ. 832 కోట్లతో పునర్నిర్మాణం చేసి వాటిని త్వరలోనే ప్రారంభిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. కృష్ణపట్నం సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమంలో MLA సోమిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆలయాల పునర్నిర్మాణం సీఎం చంద్రబాబు ఆలోచన అని పేర్కొన్నారు.
సత్యసాయి: పెనుకొండలోని వైసీపీ కార్యాలయంలో జిల్లాస్థాయి బూత్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి నిర్మాణం కీలకమని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సమర్థవంతమైన బృందాలు ఏర్పాటు చేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం వైసీపీ ఇన్ ఛార్జ్ దీపిక పాల్గొన్నారు.
GNTR: మంగళగిరి టిడ్కో మెగా పార్క్లో ఈ నెల 25, 26 తేదీలలో భారీ ఫ్యాన్ పార్క్ నిర్వహించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, ఎంపీ సాన సతీష్ తెలిపారు. టిడ్కో మెగా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో ఈ ప్రత్యేక క్రీడా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
TPT: తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కాలువల్లో చెత్త తొలగించి మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదా దేవి ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో చెత్తపై నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించాలని చెప్పారు. గంగమ్మ ఆలయం వద్ద పారిశుధ్య పనులను పరిశీలించి, జాతర సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
W.G: తణుకులో వాహనదారులను డీజిల్ కొరత వేధిస్తోంది. నిన్నటి నుంచి పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి తణుకు పరిసర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద నో డీజిల్ స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వరి కోతలు సమయం కావడంతో వరికోత యంత్రాలతో పాటు ధాన్యం రవాణా చేసే ట్రాక్టర్లు, లారీలకు డీజిల్ కొరత ఏర్పడింది.
PLD: మాచవరం మండలంలో ఆర్ఎస్కే ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఏవో రామమ్మ పర్యవేక్షణలో రెండు రోజుల ప్రకృతి వ్యవసాయ శిక్షణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వీఏఏలు, వీఏహెచ్ఎస్లు, రైతులు పాల్గొన్నారు. ఇన్ఛార్జెస్ సునీల్ కుమార్, రవి కుమార్ పాల్గొని పీఎండీఎస్ కిట్ల పంపిణీ, విత్తన గుళికల విధానం, జీవామృతంపై అవగాహన కల్పించారు. రసాయన వినియోగం తగ్గించాలని సూచించారు.