కృష్ణా: విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ పడితే అర కిలోమీటర్ పైగా ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాహనదారులు తెలిపారు. నేడు క్యాబినెట్ భేటీ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులు విజయవాడ నగరం మీదుగా అమరావతికి వెళుతుండగా పోలీసు వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ద్విచక్ర వాహనదారులు వాపోయారు.
కృష్ణా: ఈ ఏడాది ఇప్పటికే వివిధ పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని.. ఇదే విధంగా ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్లో ఇంటర్మీడియెట్ పబ్లిక్...
PLD: దాచేపల్లిలోని విజయభాస్కర కళ్యాణ మండపంలో గురువారం గురజాల నియోజకవర్గ హజ్ యాత్రికుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి టీటీడీ పాలకమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. హజ్ యాత్ర ఇస్లాంలో పవిత్రమైందని, ప్రతి ముస్లిం దానిని ఆకాంక్షిస్తారని కృష్ణమూర్తి అన్నారు.
PLD: బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులకు సంఘం ఎడ్లపాడు మండలం గోపాలపురంలో ఆస్తి నష్టం వాటిల్లింది. చెట్లు విరిగి ఇళ్లపై పడటంతో పాటు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఈ మేరకు గురువారం గ్రామంలో ఎమ్మార్వో విజయశ్రీ, వీఆర్వో, టీడీపీ నాయకులు పర్యటించి జరిగిన ఆస్తి నష్టాన్ని పరిశీలించారు. నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని తెలిపారు.
GNTR: పట్టణ సీతమ్మ కాలనీలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరం ద్వారా స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు.
BPT: చెరుకుపల్లి మండలం రాంబోట్లవారిపాలెం పంచాయతీ మోరవాగుపాలెం గ్రామానికి చెందిన దొంతిరెడ్డి శివారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవ చూపారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేసిన రూ.78,884చెక్కును టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ELR: బుట్టాయగూడెం మండలంలోని బుసరాజుపల్లి తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఇంఛార్జ్ బొరగం శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ సారధులను త్వరగా నియమించుకోవాలని సూచించారు. అనంతరం వారికి పలు సూచనలు సలహాలు అందజేశారు.
ELR: జంగారెడ్డిగూడెం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా బజార్ను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గురువారం ప్రారంభించారు. డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేశారన్నారు. నాణ్యమైన వస్తువులకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బత్తిన లక్ష్మి పాల్గొన్నారు.
ATP: బొమ్మనహాల్ మండలం గోనెహల్ గ్రామానికి చెందిన పెద్ద లింగారెడ్డి కుమారుడు వివాహం వరుని స్వగృహంలో గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఎలాంటి మనస్పర్థలు లేకుండా అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మెట్టు ఆశీర్వదించారు.
ATP: వాస్తవాలను చెక్ చేసుకోకుండా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు, పోస్టులు పెట్టి ఇబ్బందులు పడద్దని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ .. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు అది వాస్తవమైనదా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతే సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించారు.
KRNL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో నిత్య పూజలకు విరామం కల్పించినట్లు అర్చకులు తెలిపారు. గురువారం ఏకాదశి సందర్భంగా నిత్య పూజలైన పంచామృత అభిషేకాలు, పట్టు వస్త్రాలు, బంగారు కవచాలు, అలంకరణలు ఉండవని పేర్కొన్నారు. బృందావనానికి మంగళ హారతులు ఇచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి యథావిధిగా పూజలు ప్రారంభమవుతాయని వివరించారు.
NLR: పనిచేసే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు 15 రోజులుగా సమ్మె చేస్తూ ఏఎన్ఎంలు, సూపర్వైజర్లపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పొదలకూరు CHC ఎదుట యునైటెడ్ మెడికల్ హెల్త్ యూనియన్ ఆధ్వర్యంలో ఎఎన్ఎంలు, సూపర్వైజర్లు నిరసన తెలిపారు. జీతాల వ్యత్యాసం గురించి అభ్యంతరకరంగా మాట్లాడడం తగదన్నారు. 20, 30 ఏళ్ల సర్వీసు చేస్తేనే తమకు అంత జీతం వస్తోందన్నారు.
ప్రకాశం: ప్రధాన మంత్రి నూర్య ఘర్ పధకాన్ని వినియోగించుకోవాలని విద్యుత్ ఈఈ పి. శ్రీనివాసులు కోరారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో గురువారం ఈ పథరంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పథకం పొందు విధానాన్ని, ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ ఇమ్మాయిల్ బాబు, ఎల్.ఐ కాంతారావు, ఎల్ఎం నారాయణ, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలో మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ శుక్రవారం పర్యటించనున్నారు. ఆయన శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకొని, రెండు రోజులపాటు పుట్టపర్తిలో బస చేయనున్నారు. ఈ సందర్భంగా అధికారులు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. పుట్టపర్తిలో శాంతిభద్రతల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
KDP: పులివెందులలోని గుంత బజార్ ప్రాంతంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని 11 కె. వి కళాశాల ఫీడర్ కింద ట్రాన్స్ ఫార్మర్ ఎరక్షన్ ఉన్న కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.