• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తొలి ప్రాధాన్యతా ఓటుతో ఆలపాటిని గెలిపించండి: శ్రావణ్

GNTR: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు అందరికీ ఎంతో అవసరమని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం ఫిరంగిపురంలోని మార్నింగ్ స్టార్ కళాశాల, దీనాపూర్ క్రిస్టియన్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ఓటు వేయాలని అధ్యాపకులను కోరారు. 

February 19, 2025 / 12:53 PM IST

చత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో సామినేని

NTR: జగ్గయ్యపేట పట్టణంలోని ముక్త్యాల రోడ్డు నందు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ చైతన్య వారి ఆధ్వర్యంలో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఇందులో తదితరులు పాల్గొన్నారు. 

February 19, 2025 / 11:31 AM IST

26న పొదిలి శివాలయంలో జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ సందడి

ప్రకాశం: ఈనెల 26న పొదిలి పట్టణంలోని శివాలయంలో జబర్దస్త్ టీం సందడి చేయనుందని జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ బుధవారం తెలిపారు. సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా.. శివాలయంలో జబర్దస్త్ టీం మెగా ఈవెంట్ నిర్వహిస్తుందని బుల్లెట్ భాస్కర్ తెలిపారు. తనతోపాటు జబర్దస్త్ టీం ఆటో రాంప్రసాద్, ఫైమా, నరేశ్ పాల్గొంటారని చెప్పారు.

February 19, 2025 / 10:17 AM IST

చిరుత పులుల కోసం ట్రాక్ కెమెరాలు

KDP: సింహాద్రిపురం, లింగాల, పులివెందుల మండలాల్లో రెండు చిరుత పులులు సంచరిస్తున్నాయని రైతులు తరచూ వాపోతున్న విషయం తెలిసిందే. చిరుతలను చూశామని తెలపడంతో ఫారెస్ట్ అధికారులు పొలాల్లో ట్రాక్ కెమెరాలు బిగించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మంగళవారం లింగాల, కామసముద్రం గ్రామాల్లో రెండు ట్రాక్ కెమెరాలను అధికారులు ఏర్పాట్లు చేశారు.

February 19, 2025 / 09:52 AM IST

బేస్తవారిపేట లో బాలుడు మిస్సింగ్

ప్రకాశం: బేస్తవారిపేట పట్టణంలో ఓ బాలుడు మంగళవారం తప్పిపోయాడు. తల్లిదండ్రుల వివరాల మేరకు మంగళవారం మధ్యాహ్నం నుంచి తమ కొడుకు లక్కీ కనబడటం లేదని, పలుచోట్ల వెతికి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఎవరికైనా బాలుడి ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని బేస్తవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి అన్నారు.

February 19, 2025 / 09:50 AM IST

ప్రకాశం జిల్లాలో విషాదం

ప్రకాశం జిల్లాలో బుధవారం విషాద ఘటన వెలుగు చూసింది. సంతనూతలపాడు సమీప చెరువులోకి చిన్నారితో కలిసి తల్లి దూకేశారు. సమాచారం అందుకున్న సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు గజ ఈతగాళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు సంతనూతలపాడుకు చెందిన బాపట్ల సుజాత(35), అశ్వజ్ఞ(6 నెలలు)గా గుర్తించారు.

February 19, 2025 / 09:41 AM IST

బస్సుల కండిషన్‌ను చెక్ చేసిన డిపో మేనేజర్

అన్నమయ్య: బస్సులను రోడ్డుపైకి తీసుకువెళ్లి ప్రతిరోజు కండిషన్ చెక్ చేయాలని మెకానిక్, డ్రైవర్లకు మదనపల్లె ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి సూచించారు. బుధవారం బస్సుల కండిషన్లపై వారిని ఆరా తీసి బస్సులను పరిశీలించారు. అందులో భాగంగా స్టీరింగ్, బ్రేక్, బ్యాటరీ, ఎలక్ట్రికల్ వైరింగ్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు.

February 19, 2025 / 07:53 AM IST

హత్య కేసులో 8మందికి జీవిత ఖైదు

బాపట్ల: మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో జరిగిన రత్నం బాబు(22) హత్య కేసులో 8మంది నేరస్థులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు అడిషనల్ డిస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రాజవెంకటాద్రి మంగళవారం తీర్పు ఇచ్చారు. కాగా, రత్నంబాబు కరిష్మా అనే యువతిని ప్రేమించాడు. అది నచ్చని యువతి కుటుంబ సభ్యులు రత్నంబాబును కత్తులతో పొడిచి హత్య చేశారు.

February 19, 2025 / 07:52 AM IST

బాత్రూంలో స్నానం చేస్తూ జట్టు కార్మికుడు మృతి

KKD: పెద్దాపురంలో లలిత ఇండస్ట్రీస్‌లో జట్టు కార్మికుడు మంగళవారం స్నానం చేస్తూ బాత్ రూంలో మృతి చెందాడు. మృతుడు బిహార్ షబ్బీర్ ఆలం(34)గా గుర్తించారు. పచ్చకామర్లతో అనారోగ్యంగా ఉన్నాడని తోటి కార్మికులు తెలిపారు. మృతదేహాన్ని పెద్దాపురం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పెద్దాపురం పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 19, 2025 / 07:32 AM IST

త్రాగునీటి బోరుకు శంకుస్థాపన చేసిన సర్పంచ్

ASR: హుకుంపేట మండలం తీగలవలస పంచాయితీలోని బసలబంద గ్రామంలో మంగళవారం త్రాగునీటి బోరుకు సర్పంచ్ బేసు శంకుస్ధాపన చేశారు. గ్రామానికి త్రాగునీరు అందించుటకు పంచాయితీ మరియు జల్ జీవన్ మిషన్ పథక నిధుల నుండి సుమారు రూ.6 లక్షలు మంజూరు అయినట్లు ఇంజనీరు జె చందు తెలిపారు.

February 18, 2025 / 08:26 PM IST

రీ సర్వే పనులను పరిశీలించిన జేసీ

W.G: రైతులు భూములకు ఖచ్చితమైన హద్దులు గుర్తించి రికార్డులు ఆధునీకరించేందుకు ప్రయోగాత్మకంగా రీ సర్వే నిర్వహించటం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మొగల్తూరు మండలం కె.పి పాలెం గ్రామంలో జరుగుచున్న రీ సర్వే గ్రౌండ్ ట్రూతినింగ్ పనులను జేసీ సరిహద్దుల మ్యాప్‌లను పరిశీలించారు.

February 18, 2025 / 08:21 PM IST

‘శత శాతం ఉత్తీర్ణత నమోదు కావాలి’

VZM: జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆదివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత నమోదు కావాలన్నారు. అంతకుముందు అంగన్వాడీ కార్యకర్తల ఆరు రోజులు పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు అందజేశారు.

February 18, 2025 / 08:19 PM IST

దాడి కేసులో ఇద్దరికీ రిమాండ్

ప్రకాశం: పెదచెర్లోపల్లి మండలంలోని మురుగమ్మిలో జరిగిన దాడి కేసులో ఇద్దరికీ జైలు శిక్ష విధించినట్లు ఎస్సై కోటయ్య తెలిపారు. గ్రామానికి చెందిన వెంగల్ రెడ్డి, శబరి కంఠారెడ్డి పై ఈనెల 13న వల్లెం రాజశేఖర్ రెడ్డి, అతని భార్య రాజ్యలక్ష్మి దాడి చేశారన్నారు. మెజిస్ట్రేట్ ముందు ఇద్దరినీ హాజరు పరచగా కనిగిరి జడ్జి భరత్ చంద్ర ముద్దాయిలిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించారు.

February 18, 2025 / 08:18 PM IST

‘ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి’

SKLM: ఆక్వాకల్చర్ టెక్ 2.0 కాంక్లేవ్ కార్యక్రమం రెండు రోజుల పాటు విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంగళవారం ఉదయం టెక్కలి ఎమ్మెల్యే, మంత్రి కె.అచ్చెన్నాయుడు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆక్వా రంగం సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దేశంలోనే ఏపీ ఆక్వా ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు.

February 18, 2025 / 08:12 PM IST

‘చెత్తను ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రానికి తరలించాలి’

VZM: గ్రామాలలో సేకరించిన చెత్తను ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రానికి తరలించాలని ఎంపీడీవో రామకృష్ణ రాజు సూచించారు. నెల్లిమర్ల మండలం సీతారామునిపేటలోని ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రాన్ని డీపీఈఆర్‌సీ జిల్లా కోఆర్డినేటర్ బిఎస్ఎన్ పట్నాయక్‌తో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. తడిపొడి చెత్తను వేరు చేసి ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రానికి తరలించాలని క్లాప్ మిత్రలకు సూచించారు.

February 18, 2025 / 08:08 PM IST