• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ఇవాళ దర్శించుకున్నారు. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బొబ్బిలి రోడ్డులో వెలసిన ఈ దేవాలయం ఉత్తరాంధ్రలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలన్నారు.

February 23, 2026 / 04:18 PM IST

తమ్మయ్యపేటలో త్రాగునీటి కొరత

AKP: అచ్యుతాపురం మండలం దొప్పర్ల పంచాయతీ తమ్మయ్యపేటలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. గ్రామస్తులు కిలోమీటర్ల దూరంలోని శ్మశానానికి వెళ్లి చేతి బోరు ద్వారా నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని, మృతదేహాల దహనం సమయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని వాపోతున్నారు. అధికారులు తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని వారు కోరుతున్నారు.

February 23, 2026 / 04:18 PM IST

తాగునీటి సప్లై‌కు అంతరాయం

NDL: అవుకు పట్టణంలోని పలు కాలనీల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రాజా వీధిలో భూగర్భ డ్రైనేజీ పనుల కారణంగా పైప్లైన్ ధ్వంసం కావడం వల్ల సంత మార్కెట్, చాకలిపేట, ఆర్టీసీ బస్టాండ్ కాలనీల ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం స్థానికులు అధికారులు ట్యాంకర్ల ద్వారా తక్షణ ప్రత్యామ్నాయ సరఫరా అందించాలని కోరుతున్నారు.

February 23, 2026 / 04:16 PM IST

మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ బాధ్యతలు స్వీకరణ

విశాఖ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీగా సీహెచ్ అంబేద్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో సిబ్బంది సమక్షంలో బాధ్యతలు చేపట్టి మహిళల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. మహిళల భద్రత, ఫిర్యాదులపై వేగవంతమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.

February 23, 2026 / 04:14 PM IST

పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు గైర్హాజరు అంటే..!

KRNL: జిల్లా వ్యాప్తంగా ఇవాళ జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 823 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప మీడియాకు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ఎలాంటి ఘటనలు జరగలేదని, ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఆయన తెలిపారు. 26,925 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 26,102 మంది హాజరయ్యారన్నారు.

February 23, 2026 / 04:14 PM IST

ఇంటర్ పరీక్షకు ఎంత మంది గైర్హాజరు అంటే..!

ఏలూరు: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షలకు 17,864 మంది హాజరు కావలసి ఉండగా 16,850 మంది హాజరయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1,014 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారని వివరించారు. మొదటిరోజు పరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయన్నారు.

February 23, 2026 / 04:13 PM IST

లక్ష్మణేశ్వర స్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?

W.G: నరసాపురం (M) లక్ష్మణేశ్వరంలో శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవాదాయ శాఖ భీమవరం డివిజన్ ఇన్‌స్పెక్టర్ వర్ధినీడి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.3,52,089 నగదు ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్. రామచంద్ర కుమార్, ఆలయ చైర్మన్ తెలిపారు.

February 23, 2026 / 04:12 PM IST

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీల వెల్లువ

కడప: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అధ్యక్షతన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి అందిన 102 ఫిర్యాదులపై ఎస్పీ వారితో నేరుగా సంభాషించారు. ఫిర్యాదులను చట్టపరిధిలో, నిర్దేశిత సమయంలోగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 04:11 PM IST

ప్రజా సమస్యలే ప్రథమ ప్రాధాన్యం

అన్నమయ్య: మదనపల్లిలో నిర్వహించిన‘PGRS’కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ బాధితుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ, సమస్యలను తక్షణమే సంబంధిత అధికారులకు బదిలీ చేసి నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

February 23, 2026 / 04:11 PM IST

తోటవారిపాలెంలో ఎంపీ కృష్ణప్రసాద్ పర్యటన

BPT: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఆయనకు స్థానిక ప్రజలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

February 23, 2026 / 04:00 PM IST

‘పాములు-పర్యావరణ హితకారులు’

ప్రకాశం: పర్యావరణ పరిరక్షణలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, మార్కాపురం వన్యప్రాణి విభాగం స్నేక్ క్యాచర్ నిరంజన్ అన్నారు. తర్లుపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పర్యావరణ విద్యలో భాగంగా ‘పాములు-పర్యావరణ హితకారులు’ అనే అంశంపై సోమవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాము కుట్టినప్పుడు భయపడకుండా తీసుకోవలసిన ప్రథమ చికిత్స గురించి వివరించారు.

February 23, 2026 / 04:00 PM IST

‘విద్యార్థుల సంక్షేమం కోసం పోరాడండి’

TPT: ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ఏపీ స్టూడెంట్స్ జేఏసీ నిరంతరం శ్రమించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఏపీ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్‌కు సూచించారు. నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉండి వారి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

February 23, 2026 / 04:00 PM IST

ఎంపీపీ స్కూల్ ను సందర్శించిన ఎంపీడీవో

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలోని మండల ప్రజా పరిషత్ స్కూల్ ను ఎంపీడీవో ఇమ్రాన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. పాఠశాలలో హాజరు, మౌలిక వసతులు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యార్థి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 23, 2026 / 04:00 PM IST

ఉపాధి హామీ పనులు పునఃప్రారంభం

AKP: పరవాడ మండలం గొర్లవానిపాలెంలో ఈనెల 26వ తేదీ నుంచి ఉపాధి హామీ పనులను పునఃప్రారంభిస్తున్నట్లు ఎంపీడీవో రమేష్ నాయుడు తెలిపారు. గత కొన్ని రోజులుగా గ్రామంలో ఉపాధి పనులు నిలిపివేయడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సోమవారం ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లారు.

February 23, 2026 / 03:53 PM IST

‘బాగా చదువుకుని పెద్ద స్థాయికి ఎదగాలి’

W.G. బాగా చదువుకుని పెద్ద స్థాయికి ఎదగాలి అంటూ మాజీ మంత్రి డా. కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి గ్రామానికి చెందిన అందె మీనాక్షి అనే విద్యార్థిని చదువుకు అవసరమైన పుస్తకాలు లేక ఇబ్బంది పడుతోంది అని నాయకుల ద్వారా తెలుసుకున్నారు. ఆమెను సోమవారం తణుకు నివాసానికి పిలిపించి ఆమెకు కావాల్సిన పుస్తకాలను స్వయంగా అందించారు.

February 23, 2026 / 03:51 PM IST