GNTR: బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్ సోమవారం చినకాకానిలో పర్యటించి, హాయ్లాండ్ సమీపంలోని వక్ఫ్ భూములను పరిశీలించారు. గత 70 ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న 71 ఎకరాల భూమిని ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని చూడటం సరికాదని ఆయన విమర్శించారు. రైతుల జీవనాధారాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.
ASR: గంజాయి, డ్రగ్స్ వినియోగం వల్ల జీవితాలు నాశనమవుతాయని జీ.మాడుగుల CI శ్రీనివాసరావు అన్నారు. SI సాయిరామ్ పడాల్తో కలిసి ఆయన సోమవారం గెమ్మెలి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ అలవాటు వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యుల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు.
కడప, అన్నమయ్య జిల్లాల విద్యాశాఖ అధికారులకు కడప స్కౌట్ హాల్లో సోమవారం వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ RJD కే.శ్యాముల్ ముఖ్య అతిథిగా హాజరై, 100 రోజుల SSC, FLN ప్లాన్ అమలును ప్రశంసించారు. వచ్చే విద్యా సంవత్సరంలో 100% విద్యార్థుల నమోదు, ట్రాన్సిషన్ రేటు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
E.G: నిడదవోలు రూరల్ మండలం తాళ్లపాలెం రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ప్రజల ఇబ్బందులను గమనించిన మంత్రి కందుల దుర్గేష్, శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యమని, ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యత, పారదర్శకత ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
అన్నమయ్య: ఈనెల 19 నుంచి 31 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సోమవారం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్లో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం గోడపత్రికను ఆవిష్కరించిన ఆమె, ఈ శిబిరాల్లో పశువులు, దూడలు, సన్న జీవాలకు నట్టల నివారణ మందులు, గొర్రెలు, మేకలకు ఉచిత టీకాలు అందిస్తామని పేర్కొన్నారు.
అన్నమయ్య: రాయచోటిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహ వార్డెన్ దేవలాల్ నాయక్ సోమవారం మధ్యాహ్నం విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచినట్లు సమాచారం. ఆయన మృతితో వసతి గృహ సిబ్బంది, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.
AKP: జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం కే.కోటపాడు మండలం కింతాడ, బొట్టవానిపాలెం, గొండుపాలెంలో పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం కలెక్టరేట్లో విశాఖ ఉత్సవ్పై అధికారులతో సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు.
అన్నమయ్య: మదనపల్లిలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, ఆన్లైన్ మోసాలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై విచారణ చేపట్టారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.
KKD: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి కీలకమని MP సానా సతీష్ బాబు అన్నారు. సోమవారం ఢిల్లీలో CMని కలిసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాత్రింబవళ్లు రాష్ట్రం కోసం శ్రమిస్తున్న చంద్రబాబు కృషిని ప్రపంచ వ్యాప్తంగా గుర్తిస్తున్నారని కొనియాడారు. ఈ పర్యటన విజయవంతమై రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ASR: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఈ నెల 21న జరగనున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ఛైర్పర్సన్ డాక్టర్ గుమ్మ తనూజరాణి అధ్యక్షతన కలెక్టరేట్లో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఎమ్మెల్యేలు, ఎంపీపీలు హాజరుకావాలని, అధికారులు పూర్తి నివేదికలతో సిద్ధమై రావాలని కలెక్టర్ ఆదేశించారు.
ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఇవాళ బీటీపీ కాలువ పనులను పరిశీలించనున్నారు. ఒంటిమిద్ది సమీపంలో జరుగుతున్న పనుల వేగాన్ని పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ పర్యటన చేపడుతున్నారు. రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తారని అధికారులు తెలిపారు.
ASR: అరకు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం అరకులోయలో మంగళవారం వైసీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే మత్స్యలింగం సోమవారం తెలిపారు. తన క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అనుబంధ విభాగాలను నియమించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి ఆరు మండలాల పరిధిలోని పార్టీ శ్రేణులు హాజరు కావాలని ఆయన కోరారు.
సత్యసాయి: తిరుపతిలో జనవరి 21, 22 తేదీల్లో జరగనున్న మహిళా ప్రజా ప్రతినిధుల కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హాజరుకానున్నారు. మహిళలు, శిశువులు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై ఈ కమిటీ చర్చించనుంది. మహిళల భద్రత, అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యురాలిగా ఆమె కీలక సూచనలు చేయనున్నారు.
CTR: ఐరాల పూర్వ విద్యార్థుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను కలిశారు. తమ సంఘం ద్వారా ఐరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించారు. పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలో పాఠశాలను సందర్శిస్తానని తెలియజేశారు.
TPT: తిరుపతిలో సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా 2025-26 రబీ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు కార్యక్రమంపై అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, డీఆర్వో నరసింహులు పాల్గోన్నారు.