• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు అంబేద్కర్ జయంతి వేడుకలు

PPM: భారత రాజ్యాంగ నిర్మాత డా,బి.ఆర్.అంబేద్కర్ జయంతి సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈమేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళితో కార్యక్రమం ప్రారంభంమవుంతుదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొంటారని చెప్పారు.

April 13, 2025 / 01:34 PM IST

దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ

ప్రకాశం: వేసవి సెలవుల్లో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వేరే ఊర్లకు వెళ్లే ప్రజలు తమ ఇంటికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకొని మొబైల్ ఫోన్లలో వాచ్ చేయాలన్నారు. లేకుంటే పోలీసుల లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను వినియోగించుకోవాలన్నారు.

April 13, 2025 / 12:50 PM IST

నాడు విద్యార్థిగా.. నేడు ముఖ్య అతిథిగా!

ATP: బెంగళూరులోని MAHE యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో మంత్రి పయ్యావుల కేశవ్ అతిథిగా పాల్గొన్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. 30ఏళ్ల క్రితం తాను ఇక్కడే ఎంబీఏ డిగ్రీ పట్టా తీసుకున్నానని అన్నారు. నేడు తన చేతుల మీదుగా విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రధానం ఆనందంగా ఉందన్నారు.

April 13, 2025 / 11:20 AM IST

రేపు ఫిర్యాదుల స్వీకరణ ఉండదు: కలెక్టర్

ATP: అనంతపురంలో రేపు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశారు. కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం జరగదని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ సెలవు ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

April 13, 2025 / 11:00 AM IST

శ్రీ మఠంలో బృందావనానికి ప్రత్యేక పూజలు

KNRL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఆదివారం మూల బృందావనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవతో మొదలుకొని నిర్మాల్యం క్షీరాభిషేకం, పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, బంగారు కవచాలు, బెంగళూరు నుంచి తెప్పించిన ప్రత్యేక పూలతో బృందావనాన్ని చక్కగా అలంకరించారు.పీఠాధిపతి బృందావనానికి నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు ఇచ్చారు.

April 13, 2025 / 10:47 AM IST

ఇంటర్ దరఖాస్తుకు గడువు పెంపు

KRNL: కృష్ణగిరి మండల కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువు విద్యాశాఖ ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సి పాల్ చైతన్య స్రవంతి ఆదివారం తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 22 నుం చి ఈ నెల 11 వరకు నిర్దేశించగా.. ప్రస్తుతం ఈ నెల 21వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు.

April 13, 2025 / 09:49 AM IST

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న అన్నా రాంబాబు

ప్రకాశం: మార్కాపురంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం వేకువజామున స్వామివారి కళ్యాణమహోత్సవానికి మార్కాపురం వైసీపీ ఇన్‌ఛార్జ్ అన్నారాంబాబు హాజరై స్వామివారికీ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో అన్నారాంబాబు సతీమణి దుర్గకుమారి పాల్గొన్నారు. ముందుగా ఆలయ ధర్మకర్తలు అన్నారాంబాబును ఘనంగా సన్మానించారు.

April 13, 2025 / 08:20 AM IST

మరిడమ్మని దర్శించుకున్న హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్

KKD: పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారిని విజయవాడ వెలగపూడి హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ కె. కోటేశ్వరరావు, రాజమండ్రి కోర్టు జడ్జి జగదీశ్వరులు దర్శించుకున్నారు. శనివారం ఆయన మరిడమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు దేవస్థానం తరుపున వేద పండితులు, ఆసాధులు ఆలయ మర్యాదలతో సత్కరించి వేద ఆశీర్వచనాలతో అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

April 13, 2025 / 07:45 AM IST

శతకరత్న వరాల పుస్తకావిష్కరణ చేసిన డీఈవో

ప్రకాశం: ఒంగోలు రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణపై రచించిన ఘట్టమనేని కృష్ణ జీవిత శతక రత్న వరాల పుస్తకాన్ని విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

April 13, 2025 / 07:42 AM IST

వాహనాలు తనిఖీ చేసిన కనిగిరి డీఎస్పీ

ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం రాత్రి డీఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్ వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహన దారులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో అని వాకబు చేశారు. వాహనాల్లో నిషేధిత వస్తువులు సరఫరా, రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు.

April 13, 2025 / 07:38 AM IST

భర్త వేధింపులతో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

KNRL: దేవనకొండ మండలం వెంకటాపురంలో లక్ష్మి (23) శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి లలిత తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మి కర్నూలుకు చెందిన మనోహర్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. భర్త ప్రతిరోజూ లక్ష్మిని వేధించేవాడని ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని లలిత ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.

April 13, 2025 / 07:18 AM IST

ఆన్ లైన్ లో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితా

ప్రకాశం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కోసం రూపొందించిన తాత్కాలిక సినియారిటీ జాబితాను వెబ్ సైట్‌లో ఉంచినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో ఈ నెల 16వ తేదీ లోపు డీఈవో కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.

April 13, 2025 / 06:57 AM IST

వైసీపీ పీఏసీ కమిటీ మెంబర్‌గా ఆదిమూలపు సురేశ్

ప్రకాశం: వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కొండపి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్‌ను శనివారం వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 30 మందిలో ఆదిమూలపు సురేశ్ ఒకరు. కొండపి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

April 13, 2025 / 06:34 AM IST

కలప స్వాధీనం చేసుకున్న అధికారులు

ELR: అక్రమంగా డీసీఎం వ్యాన్లో తరలిస్తున్న మారుజాతి కలపను సీజ్ చేసినట్లు ఎఫ్ఎస్వో బి.దినేష్ తెలిపారు. శనివారం తెల్లవారు జామున ప్రత్తిపాడు నుంచి కొయ్యలగూడెం వస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుకున్న కలప విలువ సుమారు రూ.25వేలు ఉంటుందన్నారు. వాహనాన్ని కన్నాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.

April 12, 2025 / 08:18 PM IST

పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యత

PLD: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పీఎం ఎఫ్ఎంఈ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ జనార్దన్ రావు తెలిపారు. శనివారం నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా 35 శాతం సబ్సిడీపై రుణ సదుపాయం కలిపిస్తుందన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 12, 2025 / 08:14 PM IST