NDL: సంజామల మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సార్ బీసీ కాలువలో సాగునీరు వృథాగా పారుతోంది. పదో బ్లాక్ కాలువ వద్ద కృష్ణా జలాలు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం పంటలు నూర్పిడి దశలో ఉండటంతో నీటి అవసరం లేకపోయినా సరఫరా కొనసాగుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి వినియోగాన్ని సమర్థంగా నిర్వహించాలని కోరుతున్నారు.
సత్యసాయి: ఉగాది పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నూతన తెలుగు కాల పట్టిక, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో MLA కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని డైరీలను విడుదల చేశారు. హిందూ సంప్రదాయాలను, కాల గణనను ప్రజలకు చేరువ చేయడంలో వీహెచ్పీ కృషి అభినందనీయమని కొనియాడారు. కార్యకర్తలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ELR: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై ఏలూరు MLA బడేటి చంటి శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని YCP నేతలు అడ్డుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
NLR: నెల్లూరుకు వచ్చిన జాతీయ ST. కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యని నెల్లూరు ZP కార్యాలయంలో TDP నాయకుడు గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్గామిట్ట ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తరగతి గదులు నిర్మించేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలిస్తామని హామీ ఇచ్చారు
కృష్ణా: పామర్రు పరిధిలోని అయినంపూడిలో గంగానమ్మ గుడి సమీపంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శుక్రవారం నిరసన చేపట్టారు. ఆక్రమణను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దళితుల కులదైవమైన గంగానమ్మ గుడిని తొలగిస్తుండగా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై చర్యలు ఎందుకు లేవని అధికారులను ప్రశ్నించారు. తహసీల్దార్ వచ్చేవరకు వెళ్లేది లేదంటూ బైఠాయించారు.
గుంటూరు: జూపూడిలో విద్యుత్ షాక్తో తల్లి, కుమార్తె మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. MLA ధూళిపాళ్ల చొరవతో APCPDCL ద్వారా మంజూరైన రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని శనివారం బాధితులకు అందజేశారు. పట్టణంలోని TDP కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు MLA ఈ చెక్కులను పంపిణీ చేశారు.
ASR: రాజవొమ్మంగికి చెందిన కొంతమంది యువత సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో గంజాయి రవాణాకు పాల్పడుతున్నారు. ఇటీవల వారిలో కొంతమందిని గంజాయితో చెన్నై, జడ్డంగి పోలీసులు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొంతమంది ఇలాంటి ఘటనలకు పాల్పడడం పరిపాటిగా మారుతోంది. 3 నెలల కాలంలో 8 మంది యువత గంజాయి కేసుల్లో పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.
EG: దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదేశాల మేరకు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూచిపూడి శ్రీనివాస్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు .వైద్య ఖర్చుల నిమిత్తం లబ్దిదారులైన దాసరి సత్య కోటేశ్వరరావుకు రూ.2,50,000/-చెక్కును శుక్రవారం అందజేశారు. సర్పంచ్ నాయుడు దుర్గాప్రసాద్, జనరల్ సెక్రటరీ చెల్లిoకి వాసు తదితరులు పాల్గొన్నారు
GNTR: గరికపాటి నరసింహా రావు ఇటీవల పాఠశాల విద్యార్థుల గురించి చేసిన వ్యాఖ్యలను AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ జీ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గరికపాటి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఇబ్రహీంబాద్కు చెందిన చిన్నారి చికిత్సకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.3,89,228 చెక్కును మంజూరు చేపించారు. ఇవాళ ఎమ్మెల్యే తన కార్యాలయంలో బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన సహాయం అందించడం తమ బాధ్యత అని తెలిపారు. స్థానిక నాయకులు ఉన్నారు.
VZM: సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కవులు, కళాకారులు సాహితి వేత్తలు రథసారదులవ్వాలని పూర్వ నేషనల్ న్యాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి సత్యనారాయణ పిలుపునిచ్చారు. చైతన్య భారతి 380వ సభకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. కళా రంగంలో 40 ఏళ్లగా చేసిన సేవలకు బుర్రకథ కళాకారుడు పిరిడి జగన్నాథముకు ‘బుర్రకథ స్టార్ జూనియర్ కుమ్మర మాస్టర్’ బిరుదును ప్రధానం చేశారు.
ఎన్టీఆర్: కీసరలో పరిటాల కోటేశ్వరరావు (రాము) మీడియా సమావేశంలో వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో రేషన్ మాఫియా జరిగిందని, పనికిరాని భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చారని విమర్శించారు. శ్రీకృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోగంటి సత్యనారాయణకు జడ్పీటీసీ భర్త వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, రమాదేవి దంపతులు శుక్రవారం ఉదయం అక్కమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. తమ స్వగృహం నుంచి అమ్మవారి కలశంతో వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు.
E.G: తెలుగు సంవత్సరాది సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాజమండ్రికి చెందిన ప్రముఖ చిత్రకారుడు హరి తాడోజు పురస్కారం అందుకున్నారు. ఈ మేరకు సీఎం చేతుల మీదుగా హరి తాడోజు అందుకున్న పురస్కారం జ్ఞాపికను శుక్రవారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కి చూపించారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని, విశేషాలను పంచుకున్నారు.
CTR: జిల్లాలో శనివారం జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్ష రంజాన్ పర్వదినం పురస్కరించుకుని వాయిదా వేసినట్లు బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయం పేర్కొంది. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, లాజిక్ పేపర్ – 1 పరీక్ష ఈనెల 25వ తేదీ జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేశారన్నారు.