• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కార్డాన్ సెర్చ్.. 40 బైక్స్, 8 ఆటోలు సీజ్

GNTR: తెనాలి వన్ టౌన్ పరిధిలోని వైకుంఠపురం వద్ద డీఎస్పీ జనార్ధన్ రావు నేతృత్వంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటి తనిఖీలు చేసి ఆధార్, ఇతర పత్రాలు పరిశీలించారు. సరైన రికార్డులు లేని 40 ద్విచక్రవాహనాలు, 8 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

April 25, 2026 / 08:09 AM IST

‘చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించండి’

KKD: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేనేత కులాల సమైక్య సభ్యులు కోరారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కలిసి చేనేత కులాల సమైక్య అధ్యక్షుడు రామకృష్ణ కొత్తపల్లి మండల చేనేత కార్మికులు అందజేశారు. చేనేత కార్మికులకు తక్షణం రూ. 25 వేల సహాయం, చేనేతకు బడ్జెట్‌లో రూ. 2వేల కోట్లు కేటాయించాలని, ఆప్కో బకాయిలు చెల్లించాలన్నారు.  

April 25, 2026 / 08:09 AM IST

ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు మూడేళ్ల జైలు

అన్నమయ్య: మదనపల్లెలో ఇద్దరు కూలీల మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018లో గుట్టవారిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. శుక్రవారం ఈ కేసును 2వ ఏడీజే కోర్టు జడ్జి సూర్యనారాయణ విచారించి తీర్పు వెల్లడించారు.

April 25, 2026 / 08:06 AM IST

‘స్వీయ గణన కార్యక్రమం విజయవంతం చేయాలి’

ASR: జనగణన-2027లో భాగంగా జిల్లాలో నిర్వహించనున్న స్వీయ గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ టీ.నిశాంతి శుక్రవారం అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన పోర్టల్లో, స్వీయ గణనను నమోదు చేసుకోవాలన్నారు. అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా ఈ గణనను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

April 25, 2026 / 08:05 AM IST

నేడు 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

SKLM: జిల్లాలో ఇవాళ 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. హిరమండలం, పాతపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొన్నారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 లోపు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళరాదని కోరారు.

April 25, 2026 / 08:05 AM IST

రేపు కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

అనకాపల్లిలో కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈనెల 26వ తేదీన కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం అమ్మవారికి పల్లకి ఊరేగింపు, తిరువీధి సేవ మహోత్సవం, గోపూజ, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అధ్యక్షులు రవిరాం జవహర్ తెలిపారు. అమ్మవారికి లక్ష మల్లెపూలతో అర్చన సామూహిక లలిత సహస్రనామ పారాయణం జరుగుతుందన్నారు.

April 25, 2026 / 08:05 AM IST

రీసర్వేపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం

సత్యసాయి: పుట్టపర్తిలో రీసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జేసే మౌర్య భరద్వాజ్ ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సర్వే నోటీసులు రైతులకు సకాలంలో అందజేయాలని, గ్రామాల్లో చాటింపు ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు.

April 25, 2026 / 08:02 AM IST

రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించిన ఎస్సై

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు డెంకాడ పోలీసు స్టేషను పరిధిలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఎస్సై సన్యాసినాయుడు శుక్రవారం సందర్శించారు. ఆనంతరం గ్రామస్తులకు సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీస్ స్టేషనుకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఓటీపీలపై గోప్యత పాటించాలని సూచించారు.

April 25, 2026 / 08:01 AM IST

244 మంది పోలీస్ సిబ్బందికి రివార్డులు

విశాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 244 మంది పోలీసులకు సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం రివార్డులు అందజేశారు. వివిధ కేసుల్లో సిబ్బంది కనబరిచిన ప్రతిభకు హోం గార్డ్ నుంచి సీఐ వరకు రివార్డులు అందించారు. గంజాయి సీజ్, చోరీ కాబడిన సొత్తు రికవరీ, పలు కేసులలో నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందికి రివార్డులు అందించారు. సీపీ ఈ ప్రోత్సాహకాలను ప్రతినెలా అందజేస్తున్నారు.

April 25, 2026 / 08:00 AM IST

రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం

KRNL: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా, పట్టణంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు జిల్లా మూడవ పట్టణ సీఐ శేషయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.

April 25, 2026 / 07:47 AM IST

నేడు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ATP: ఆత్మకూరు మండల కేంద్రంలో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ దాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ మరమ్మతుల కోసం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. దీనికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరమ్మతుల అనంతరం విద్యుత్ సరఫరాని చేస్తామన్నారు.

April 25, 2026 / 07:45 AM IST

శేష వాహనంపై ఊరేగింపు

CTR: చౌడేపల్లె అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఉత్సవమూర్తులను శేష వాహనంపై మేళ తాళాలతో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం ఉభయదారులుగా వ్యవహరించారు.

April 25, 2026 / 07:45 AM IST

నేటి నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

SKLM: ఉత్తరాంధ్ర ఇరవై వేలుకు పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి 51 వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ నుంచి 3 రోజులు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సన్యాసిరావు తెలిపారు. ప్రతిరోజు సా.4 నుంచి రాత్రి 11 గంటల వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొనాలని కోరారు.

April 25, 2026 / 07:40 AM IST

‘సార్వజనిక సేవలు సౌకర్యవంతంగా అందించటమే లక్ష్యం’

VZM: ప్రజలకు సార్వజనిక సేవలను మరింత సౌకర్యవంతంగా అందించే లక్ష్యంతో మదర్‌ ఫీడింగ్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను హెడ్ పోస్టాఫీలో పోస్టుమాష్టర్ జనరల్ వియస్ జయశంకర్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ… ఈ కొత్త సౌకర్యాలు ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడంలో సహాయ పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ కే. శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

April 25, 2026 / 07:35 AM IST

నేడే పాలీసెట్.. నిమిషం నిబంధనతో అప్రమత్తం

VSP: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షను అధికారులు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుందన్నారు. ఓఎంఆర్ షీట్లపై అవగాహన కోసం గంట ముందే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. జిల్లాలో మొత్తం 44 కేంద్రాల్లో 14,689 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

April 25, 2026 / 07:33 AM IST