• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అంగన్వాడి వర్కర్లు రిలే నిరాహార దీక్ష

CTR: అంగన్వాడి సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ, CITU, IFTU ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అందులో భాగంగా సోమవారం అంగన్వాడి వర్కర్స్ ఆధ్వర్యంలో నగరిలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్లు మాట్లాడుతూ.. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 03:49 PM IST

కావేరి ట్రావెల్స్ చెందిన ప్రైవేట్ బస్సు డ్రైవర్‌కి జైలు శిక్ష

TPT: శ్రీకాళహస్తి SDPO నరసింహమూర్తి ఆధ్వర్యంలో, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రాత్రి తనిఖీల సమయంలో, కావేరి ట్రావెలకు చెందిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఎం.జానయ్య అధిక మోతాదులో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. నిందితుడిపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టు 12 రోజుల పాటు జైలు శిక్ష విధించింది.

February 23, 2026 / 03:47 PM IST

‘బీసీ భవనానికి బడ్జెట్‌లోనే శ్రీకారం చుట్టాలి’

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్న నేపథ్యంలో బీసీ భవన నిర్మాణాన్ని ఈ బడ్జెట్‌లోనే వేగవంతంగా ప్రారంభించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అసెంబ్లీలో కోరారు. వెలగపూడిలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో “బీసీ సంక్షేమం”పై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు.

February 23, 2026 / 03:46 PM IST

అనారోగ్యానికి గురైతే ఫోన్ చేయండి: కలెక్టర్

తూ.గో: రాజమహేంద్రవరంలోని లాలాపేట చెరువు చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. పాల వ్యాపారి 46 మంది రైతుల వద్ద పాలు సేకరించి 106 కుటుంబాలకు పోశాడన్నారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే కాల్ సెంటర్‌కు (94940 60060)ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

February 23, 2026 / 03:45 PM IST

అనారోగ్యానికి కల్తీ పాలే కారణం: సత్యకుమార్

తూ.గో: రాజమండ్రిలో కల్తీ పాల వల్ల జరిగిన మరణాలు, అనారోగ్య ఘటనలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనకు సంబంధించి 106 కుటుంబాలకు పాలు సరఫరా అయినట్లు గుర్తించామని, ఇప్పటికే ఆయా కుటుంబాల నుంచి శాంపిల్స్ సేకరించి విచారణ జరుపుతున్నామని తెలిపారు. అనారోగ్యానికి కల్తీ పాలే కారణమని వెల్లడించారు.

February 23, 2026 / 03:43 PM IST

సీసీ కెమెరాల నిఘాలో YVU పీజీ పరీక్షలు

కడప: ప్రొద్దుటూరు కేంద్రాలుగా వైవీయూ పీజీ తొలి సెమిస్టర్ పరీక్షలు సోమవారం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మొదలయ్యాయి. వైవీయూ క్యాంపస్‌లో జరుగుతున్న పరీక్షలను వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.చీఫ్ సూపరింటెండెంట్ గది నుంచి సీసీ కెమెరాల ద్వారా జరుగుతున్న పర్యవేక్షణను పరిశీలించారు.

February 23, 2026 / 03:43 PM IST

నందవరంలో టీడీపీ గ్రామ కమిటీలు పూర్తి

KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు నందవరం మండలం నందవరం 1, 2, 3 గ్రామాల కమిటీలను పూర్తి చేశారు. గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసి కమిటీలను రూపొందించి ఇంఛార్జ్‌కు సోమవారం అందజేశారు. గ్రామ స్థాయి నుంచే పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ కమిటీలు పనిచేస్తాయని నాయకులు తెలిపారు.

February 23, 2026 / 03:36 PM IST

అహోబిలంలో హుండీ ఆదాయం లెక్కింపు

NDL: ఆళ్లగడ్డ నియోజకవర్గం లో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలం ఆలయంలో సోమవారం హుండీ కానుకల లెక్కింపు ప్రారంభమైంది. ఆలయ ప్రధాన అర్చకులు అధికారుల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేవా సమితి సభ్యులు పాల్గొని కానుకల లెక్కింపులో తమ సేవలు అందించారు.

February 23, 2026 / 03:33 PM IST

ఫిరంగిపురంలో అంగన్వాడీల రిలే దీక్షలు

GNTR: ఐసీడీఎస్ బడ్జెట్ పెంపుతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయం సమీపంలో అంగన్వాడీలు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలను ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి. రమణ ప్రారంభించారు.

February 23, 2026 / 03:30 PM IST

అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం

కృష్ణా: మొవ్వలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరావు ఈరోజు ప్రారంభించారు. 2023లో అంగన్వాడి వర్కర్స్ 42 రోజుల పాటు సమ్మె నిర్వహించగా, గత ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం మినిట్స్ కమిటీ ఏర్పాటు చేసి ఆమోదించినప్పటికీ, కూటమి ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించలేదన్నారు.

February 23, 2026 / 03:30 PM IST

నందిగామలో RDO ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు

NTR: ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో నందిగామ RDO ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టరు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గోపాల్ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న 1810 మినీవర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని కోరారు.

February 23, 2026 / 03:29 PM IST

అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయంలో సోమవారం పూలకుంటపల్లి పెద్ద తండా గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడుకు ఈ నెల 27, 28 తేదీలలో జరిగే శ్రీ శ్రీ టకరమ్మ, శ్రీ భనకమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.

February 23, 2026 / 03:27 PM IST

ధర్మవరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

సత్యసాయి: ధర్మవరంలో టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌ సోమవారం పంపిణీ చేశారు. తాడిమర్రి, ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.15 లక్షల విలువైన 26 చెక్కులను అందజేశారు. శ్రీరామ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరట కలిగిస్తోందని తెలిపారు.

February 23, 2026 / 03:26 PM IST

‘నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కరించాలి’

VZM: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ప్రజలు సమర్పించిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో RDO కీర్తితో కలిసి ఆయన వినతులు స్వీకరించారు. అర్జీలపై సంబంధిత జిల్లా, మండల అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు.

February 23, 2026 / 03:25 PM IST

గోవిందమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం

TPT: సత్యవేడు మండలం మధనంబేడు గ్రామంలో మృతి చెందిన గోవిందమ్మ కుటుంబానికి టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ పరుచూరి శివకుమార్ నాయుడు రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. ఆయన తరఫున పార్టీ ప్రతినిధులు గ్రామానికి వెళ్లి బంధువులకు నగదు అందజేశారు. దహన సంస్కారాల కోసం ఈ సహాయం అందజేసినట్లు తెలిపారు.

February 23, 2026 / 03:24 PM IST