• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మండల ఇన్‌ఛార్జ్ తహశీల్దారుగా వేల్పుల రాజసింహ నరేంద్ర

KDP: బ్రహ్మంగారిమఠం మండల ఇన్‌ఛార్జ్ తహసీల్దారుగా వేల్పుల రాజసింహ నరేంద్ర బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఇన్‌ఛార్జ్ తహసీల్దారు రెవిన్యూ అధికారులతో వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఉత్సవాల్లో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

May 7, 2025 / 01:37 PM IST

‘సీతారామరాజు ఆశయ సాధనకు కృషి చేయాలి’

GNTR: నగరంలోని నాజ్ సెంటర్లో అల్లూరి సీతారామరాజు వర్ధంతి పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కె.యస్ లక్ష్మణరావు పాల్గొని విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారామరాజు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రకృతి వనాలపై జరుగుతున్న మైనింగ్ దోపిడికి యువత అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు.

May 7, 2025 / 01:33 PM IST

మంచాలమ్మ తిరుణాలకు మంత్రిఆహ్వానించిన టీడీపీ నాయకులు

అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని బుధవారం రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద సంబేపల్లి మండలం, నారాయణరెడ్డి పల్లె మంచాలమ్మ తిరునాళ్లకు రావాలని నారాయణరెడ్డిపల్లె గ్రామ ప్రజలు మరియు టీడీపీ నాయకులు మంత్రివర్యులను కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచాలమ్మ తిరునాళ్లకు తప్పక హాజరవుతానన్నారు.

May 7, 2025 / 01:30 PM IST

వాసవీ మాత విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమి పూజ

ATP: తాడిపత్రిలోని కడప రోడ్డు బైపాస్‌లో వాసవి మాత విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన మహోత్స కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

May 7, 2025 / 01:29 PM IST

పెద్దాపురంలో అథ్లెటిక్స్ పోటీలు.. విజేతలకు బహుమతులు

KKD: పెద్దాపురంలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. బుధవారం మహారాణి కాలేజీలో అండర్-12, 14, 16 వయస్సు గ్రూప్ బాల బాలికలకు పోటీలు నిర్వహించారు.100 మీటర్ల లాంగ్ జంప్, షాట్ పూట్ క్రీడా పోటీలు జరిగాయి. విజేతలకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం బహుమతులు అందజేశారు.

May 7, 2025 / 12:58 PM IST

నరసన్నపేటలో జాబ్ మేళా

SKLM: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా ప్రిన్సిపాల్ డాక్టర్ పెద్దాడ లత తెలిపారు. బుధవారం ఆమె పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ఈనెల తొమ్మిదవ తేదీన నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా చేపడుతున్నామన్నారు. ఈ జాబ్ మేళాలో 12 కంపెనీలు పాల్గొంటున్నాయని వివరించారు. అర్హత కలిగిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

May 7, 2025 / 12:47 PM IST

మన్యం వీరుడుకి ఘన నివాళులు

ASR: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా డుంబ్రిగుడలో అల్లూరి విగ్రహానికి స్థానిక అల్లూరి యూత్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై అల్లూరి అంటూ నినాదాలు చేశారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం 27ఏళ్ల వయస్సులోనే ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సూర్య, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

May 7, 2025 / 12:47 PM IST

విద్యుత్ భారాలు తక్షణమే తగ్గించాలి

SKLM: విద్యుత్ కొనుగోలు పేరుతో ప్రజలపై అదనపు భారం మోపేలా కుదుర్చుకున్న యాక్సిస్ ఎనర్జీ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని వైసీపీ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. ఇప్పటికే పెరిగిన ట్రూ-అప్ ఛార్జీలు, ఎఫ్‌పిపిసిఎ వంటి వాటితో సామాన్యులు తీవ్రంగా నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

May 7, 2025 / 12:27 PM IST

మన్యం వీరుడికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

E.G: మన్యం వీరుడు స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా క్షత్రియ సామాజిక వర్గం ఆధ్వర్యంలో రామాలయం జంక్షన్‌లో బుధవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. MLA మాట్లాడుతూ .. స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం వస్తుందని దాని కోసం ప్రాణాలర్పించిన యోధుడు అని తెలిపారు.

May 7, 2025 / 11:13 AM IST

చిట్టిపాలెం వద్ద టిప్పర్ బోల్తా

కృష్ణా: ఇసుక లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడిన ఘటన బందరు మండలం చిట్టిపాలెం వద్ద బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పరిమితికి మించిన బరువుతో ఇసుక రవాణా చేపట్టడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

May 7, 2025 / 11:02 AM IST

విజయవాడలో లాడ్జీల్లో పోలీసుల తనిఖీలు

కృష్ణా: విజయవాడ 3టౌన్ పరిధిలోని లాడ్జీల్లో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. లాడ్జీల నిర్వహణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన సీఐ నాగమురళి, బస చేసే వారి గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి గదులు కేటాయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

May 7, 2025 / 09:57 AM IST

సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆదాయం రూ.9.15 లక్షలు

కృష్ణా: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి మంగళవారం ఒక్కరోజులో వివిధ సేవల ద్వారా రూ.9,15,853 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

May 7, 2025 / 09:45 AM IST

సర్పవరం ఆలయాన్ని సందర్శించిన డీఎస్పీ

కాకినాడ జిల్లా డీఎస్పీ మనీష్ దేవరాజ్ మంగళవారం రాత్రి రూరల్ సర్పవరంలోని శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం సందర్శించారు. ఈ నెల 8న నిర్వహించనున్న కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అదే విధంగా తెప్పోత్సవం వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సిబ్బందిని ఆదేశించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్ల గురించి వివరించారు.

May 7, 2025 / 08:15 AM IST

నేటి కూరగాయల ధరలు ఇవే..

కృష్ణా: గన్నవరం రైతు బజార్‌లో కేజీలలో కూరగాయల ధరలను వ్యవసాయ వాణిజ్యశాఖ అధికారులు బుధవారం తెలిపారు. టమాటా రూ.14, వంకాయ రూ.22, బెండకాయ రూ.18, పచ్చిమిర్చి రూ.23, కాకరకాయ రూ.34, బీర రూ.26/35, క్యాబేజీ రూ.15, క్యారెట్ రూ.29, దొండకాయ రూ.16, బంగాళదుంప రూ.28, గోరుచిక్కుళ్లు రూ.30, దోస రూ.18, అల్లం రూ.44, బీట్‌రూట్ రూ.27, కీరదోస రూ.37, ఉల్లిపాయలు రూ.20లుగా ఉన్నాయి.

May 7, 2025 / 07:34 AM IST

ఈ నెల 12 నుండి ఉచిత కంప్యూటర్ శిక్షణ

W.G: నిడదవోలులోని SVRK ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 12వ తేదీ నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. నిరుద్యోగులతో పాటు, గృహిణులకు కంప్యూటర్ శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, టైపింగ్, ఇంటర్నెట్ స్కిల్స్ పై శిక్షణ ఇస్తామన్నారు. 16-38 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులన్నారు.

May 7, 2025 / 07:11 AM IST