GNTR: కాకుమాను మండలం కొండపాటూరులో పోలేరమ్మ తల్లి తిరునాళ్లు ఏప్రిల్ 7న నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ పొన్నం వీరయ్యచౌదరి, ఈవో జక్కా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం పంచాంగ శ్రవణం అనంతరం పోస్టర్ విడుదల చేశారు. ఈ నెల 31న మల్లెల పూజ, ఏప్రిల్ 3న కుంకుమ పూజ జరుగుతుంది. పూజా సామగ్రి ఆలయం నుంచి అందిస్తారన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
నెల్లూరూలో రూ. 27 కోట్లతో చేపట్టిన 240 అభివృద్ధి పనులను ఈనెల 22న ప్రారంభించనున్నట్లు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు రూరల్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ ఉంటుందన్నారు.
BPT: అర్హులైన పేదలకు ఇళ్లు, ఇంటి స్థలం, సాగుభూమి కల్పించాలనే డిమాండ్తో మార్చి 24న రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆందోళనలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పిలుపునిచ్చారు. పట్టణాల్లో రెండు సెట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు.
ASR: పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 43 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ దినేష్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భీమవరం దాతలు వుద్ధరాజు రాఘవరాజు, సూర్యనారాయణ రాజు రూ.17 లక్షల వ్యయంతో స్వర్ణ శఠగోపాన్ని చేయించారు. 108 గ్రాముల బంగారంతో తయారు చేసిన దీనిని శుక్రవారం కొత్తపేట MLA బండారు సత్యానందరావు సమక్షంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందించారు. సంప్రోక్షణ, ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి సేవలకు వినియోగించారు.
KRNL: నందవరం(మం) నాగలదిన్నెలో నిర్మించనున్న అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి MLA డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు. దేవాలయ నిర్మాణం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. దేవాలయాల నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ పాల్గొన్నారు.
KDP: సిద్ధవటం(మం) మాధవరం-1 పంచాయతీలోని వెంకటేశ్వరపురంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉండడంతో శుక్రవారం గ్రామ మహిళలు ఆందోళనకు దిగారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య ఏ మాత్రం పరిష్కారం కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై మహిళలు బిందెలతో నిరసన తెలుపుతూ.. తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
VSP: గోపాలపట్నం రైతు బజార్లో ఓ రైతు తన నిజాయితీని చాటుకున్నాడు. బజార్కు వచ్చిన వినియోగదారుడు శ్రీనివాసరావు తన మొబైల్ ఫోన్ను ఓ స్టాల్ వద్ద మర్చిపోయి వెళ్లిపోయాడు. దీనిని గమనించిన అక్కడి రైతు నిజాయితీగా ఫోన్ను ఎస్టేట్ అధికారికి అందజేశాడు. ఇంటికి వెళ్లాక ఫోన్ మిస్సైన విషయం గుర్తించి తిరిగి బజార్కు రాగా అధికారులు అతనికి ఫోన్ అప్పగించారు.
అన్నమయ్య: మదనపల్లిలో జరిగిన చౌడేశ్వరి దేవి ఉత్సవాల్లో రాష్ట్ర రవాణా, యువజన & క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. జిల్లా ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
ప్రకాశం: మర్రిపూడి మండలం కేజీ కండ్రిక గ్రామంలో గత నెల రోజులుగా గ్రామస్థులు తాగునీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ వారు గ్రామంలో కాలువ తీస్తూ పైపులు పగలగొట్టారని కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నాడు. పంచాయతీ పదవి బాధ్యతలు ముగుస్తున్నాయని తమకు సంబంధంలేదని పంచాయతీ వారు అంటున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
నంద్యాల కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్నతో పాటు సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నగర అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను సమయానుకూలంగా పరిష్కరించాలన్నారు.
TPT: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కెరీర్ కౌన్సిలింగ్- వ్యక్తిత్వ వికాస సదస్సులో ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ.. విద్యార్థులు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అతిథులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, మత్తు పదార్థాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
W.G: తాడేపల్లిగూడెంకు చెందిన తమ్మారెడ్డి రామ్ సిద్ధార్థ ఇటీవల విడుదలైన గేట్ పరీక్షలో ECE విభాగంలో 128వ ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ ప్రవేశ పరీక్షలో 128వ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు శ్రీనివాస్ బాబు, పద్మలత హర్షం వ్యక్తం చేశారు. తండ్రి శ్రీనివాసబాబు RWSDEగా పనిచేస్తున్నారు.
CTR: యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తెలిపారు. విద్యా, పోలీస్ శాఖల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పారు. 20 నెలల్లో 6 లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు భరోసా అని ఆయన పేర్కొన్నారు.
ELR: ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు అన్నారు. శుక్రవారం ఉంగుటూరు(మం) నారాయణపురంలో పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి విజయకుమార్, గుమస్తా స్వరూప పాల్గొన్నారు.