• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎంపీ అంబిక

ATP: సింగనమల మండలం పెరవల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మతో కలిసి పూజలు నిర్వహించిన ఆయన, గ్రామస్థులతో కలిసి కోలాట భజనలో పాల్గొన్నారు. వాల్మీకి సమాజం విద్యాపరంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

February 23, 2026 / 04:34 PM IST

అందుబాటులో మరో 36 కిషాన్ డ్రోన్‌లు

TPT: జిల్లాలో గత ఏడాది సబ్సిడీ కింద జిల్లాలో 36 కిషాన్ డ్రోన్‌లను అందుబాటులోకి తెచ్చారు. సబ్సిడీ కింద ఐదుగురు రైతుల గ్రూప్‌గా కలిసిన సభ్యులకు శిక్షణ ఇచ్చి అందజేశారు. రైతులు డ్రోన్ కావాలంటే కిషాన్ డ్రోన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీ సమీపంలో డ్రోన్‌లు ఎక్కడ ఉన్నాయి, వారి వివరాల తెలుసుకుని సంప్రదించవచ్చు. ఎకరానికి రూ.400 చొప్పున సేవా ధరను నిర్ణయించారు.

February 23, 2026 / 04:34 PM IST

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చలో కలెక్టరేట్

GNTR: గ్రామపంచాయతీ కార్మికులకు జీతాల పెంపు, 132, 142, 680 జీవోలను తక్షణమే అమలు , టెండర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఫిరంగిపురంలో మంగళవారం కరపత్రాన్ని విడుదల చేశారు.

February 23, 2026 / 04:32 PM IST

కోడి పందేల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

కృష్ణా: ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్‌ఐ వి. చందన తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక కోడి పుంజు, రూ.1,67 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 23, 2026 / 04:30 PM IST

జిల్లాలో పశువుల హాస్టళ్లు

సత్యసాయి: పాడి రైతులకు ఊరటనిస్తూ ప్రభుత్వం ‘కమ్యూనిటీ అనిమల్ హాస్టళ్ల’ పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ధర్మవరం, ముదిగుబ్బ, పరిగి, సోమందేపల్లి, అమరాపురంలో ఐదు యూనిట్లను మంజూరు చేశారు. ఒక్కో హాస్టల్‌ను రూ.10 లక్షలతో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించనున్నారు. 50 సెంట్ల విస్తీర్ణంలో 20 పశువులకు వసతి కల్పిస్తారు.

February 23, 2026 / 04:28 PM IST

పాఠశాలలోకి దూసుకెళ్లిన వ్యాన్.. తప్పిన ముప్పు

ASR: జీకేవీధి మండలం కస్తూర్బా గాంధి పాఠశాలలోకి వాహనం దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్నందున ఆ పనులకు సోమవారం ఉదయం ఇసుక తీసుకువచ్చిన వ్యాన్ అదుపుతప్పి గోడ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రహరీ గోడ విరిగి వాహనం బోల్తా పడింది.

February 23, 2026 / 04:27 PM IST

అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా

కడప: నగరంలో గంజాయి సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాల సాయంతో అనుమానిత ప్రాంతాల్లో నిఘా ఉంచి దాడులు నిర్వహిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. స్పెషల్ పార్టీలతో అనుమానితులను గుర్తించే చర్యలు వేగవంతం చేశారు.

February 23, 2026 / 04:26 PM IST

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 443 అర్జీలు

TPT: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో మొత్తం 443 అర్జీలు అందాయి. వచ్చిన ప్రతి అర్జీకి సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. అర్జీదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ వారి సమస్యలను స్వయంగా స్వీకరించారు.

February 23, 2026 / 04:26 PM IST

కలెక్టరేట్ ముందు కౌలు రైతుల సంఘం ధర్నా

ELR: కౌలు రైతుల రక్షణ కోసం నూతన కౌలు చట్టం తీసుకురావాలని, కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని కౌలు రైతుల సంఘం తెలిపారు. రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు, కౌలు రైతులకు రవాణా కిరాయిలు, హమాలీ చార్జీలు పెంచాలన్నారు.

February 23, 2026 / 04:25 PM IST

మెడికల్ మాఫియాను అరికట్టాలి: సీపీఐ నేతలు

NLR: మెడికల్ మాఫియాను అరికట్టాలని నెల్లూరు కలెక్టరేట్ ఎదుట సీపీఐ నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. ఇన్సూరెన్స్ కంపెనీలను దృష్టిలో పెట్టుకొని దేశంలో వైద్యం జరుగుతోందన్నారు. పేషెంట్ హాస్పిటల్‌కి వెళ్తే వ్యాధి గురించి అడగకుండా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని రోగిని అడిగి వైద్యానికి ఉపక్రమించడం సిగ్గుచేటన్నారు.

February 23, 2026 / 04:24 PM IST

‘ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం’

SKLM: ఆరోగ్య సబ్ కమిటీలకు ఎఫ్ఎన్హెచ్‌డబ్ల్యూ పై మందస వెలుగు కార్యాలయంలో సోమవారం మండల పీవో పైడి కూర్మారావు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రజల ఆరోగ్యం పై అవగాహన పెంచడం లక్ష్యమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన కూరగాయలు, ఆకు కూరలు వినియోగించడం ద్వారా అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చన్నారు.

February 23, 2026 / 04:23 PM IST

మెరుపు సమ్మెకు దిగుతాం: ఆర్టీసీ ఉద్యోగులు

NLR: నెల్లూరులోని ఆర్టీసీ-2 డిపో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఆర్టీసీ-2 డిపోను పినకిల్ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంప్లాయిస్ యూనియన్ డిపో సెక్రటరీ ప్రసాద్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

February 23, 2026 / 04:21 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ లక్ష్యం’

SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణు గోపాలం అన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు జనతా వారధి అనే కార్యక్రమాన్ని సోమవారం జిల్లా జడ్పీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

February 23, 2026 / 04:20 PM IST

తిరుపతిలో విలువల విద్యా సదస్సు

TPT: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన “విలువల విద్యా సదస్సు”లో ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పాల్గొని విద్యార్థుల్లో నైతిక విలువల ప్రాధాన్యంపై ఉపన్యసించారు. జీవితంలో ధర్మం, క్రమశిక్షణ, బాధ్యతాభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డీఈవో, అధికారులు హాజరయ్యారు.

February 23, 2026 / 04:19 PM IST

ఆరోగ్యకర జీవనశైలికి పోర్టు పిలుపు

విశాఖ పోర్టు స్టేడియంలో సోమ‌వారం ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్‌ను ఉత్సాహంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఫిట్‌నెస్ ఉద్యమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో వీపీఏ ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యం, సక్రియ జీవనశైలిపై అవగాహన కల్పించడం లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

February 23, 2026 / 04:18 PM IST