NTR: ఎలమంచిలిలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాదంలో విజయవాడ వాసి చంద్రశేఖర్ సుందర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి వద్ద ఉన్న బ్యాగులో రూ.5.80 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదంలో ఈ నగదులో కొన్ని నోట్లు పాక్షికంగా కాలిపోయాయి. సోమవారం ఉదయం రైల్వే పోలీసులు ఓ సంచిలో ఈ సొమ్మంతా ప్యాక్ చేసి స్వాధీనం చేసుకున్నారు.
ASR: రంపచోడవరం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు 78 వినతులు వచ్చినట్లు పీవో స్మరన్ రాజ్ తెలిపారు. ప్రధానంగా సీమగండి-వేములకొండ, కుట్రవాడ-పాములేరు గ్రామాల మధ్య రోడ్లు, నూతన పెన్షన్ల కోసం ప్రజలు విజ్ఞప్తి చేశారు. కొన్ని సమస్యలను పీవో తక్షణమే పరిష్కరించగా, మిగిలిన వాటిని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు.
సత్యసాయి: మడకశిర పట్టణం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మడకశిర ఎమ్మెల్యే MS రాజు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మడకశిర పట్టణంలో గతంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిన అభివృద్ధి పనుల పురోగతి గురించి చర్చించారు. పాత విద్యుత్ స్తంభాల మార్పు, కొత్త విద్యుత్ స్తంభాల కోసం ప్రతిపాదనలు పంపాలని విద్యుత్ అధికారులకు సూచించారు.
VZM: నూతన సంవత్సర వేడుకలను జిల్లాలో ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి బహిరంగ ప్రదేశాలు, రహదారులపై వేడుకలు నిర్వహించరాదని, మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామన్నారు.
KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గం జిల్లా కేంద్రం చేయాలని ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి సభ్యులకు కోరారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక TDP కార్యాలయం నందు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా సాధన చేయాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. న్యాయవాది సురేష్, డాక్టర్ దస్తగిరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంతో ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని, ఆ దిశగా వినూత్న రీతిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులకు సూచించారు. ఒకే సమస్యపై ఫిర్యాదులు పలుమార్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే వినతులకు నా...
VZM: విజయనగరం పట్టణం దాసన్నపేటలోని అతి పురాతన శ్రీ చిన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతన కవచధారణ మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ అరవెల్లి రామాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 108 మంది మహిళలచే ప్రత్యేక దీపారాధన నిర్వహించారు.
ASR; జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ అమిత్ బర్దార్, పోలీసు అధికారులతో వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని ఎస్పీ తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం కేసులు తగ్గాయన్నారు. ఈ ఏడాది 135 ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయని, 14,484.38 కిలోల గంజాయి, 35.61 కిలోల హషీస్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
కృష్ణా: చదువులో మర్మం గ్రహించే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులవుతారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం చల్లపల్లిలో 800 మంది టెన్త్ విద్యార్థులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు విద్య మాత్రమే సాధనమని ఆయన తెలిపారు. టెన్త్ ఫలితాల్లో కృష్ణా జిల్లా ఐదో స్థానం సాధించాలని డీఈవో యూవీ సుబ్బారావుకు సూచించారు.
తిరుపతిలో సోమవారం డాక్టర్ పనబాక లక్ష్మీ తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని బూత్ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ATP: నగరంలోని మెడికల్ కళాశాల, ప్రభుత్వ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ కార్మికులకు తక్షణమే పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలన్నారు. ఈ మేరుకు సోమవారం PGRSలో కలెక్టర్ ఆనంద్కు ఏఐటీయూసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. వేతనాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
BPT: గ్రామాలలోని సమస్యలను పరిష్కరిస్తానని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాల ప్రజలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో సమస్యలను ఎమ్మెల్యేకి తెలిపి, పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అనకాపల్లి: పీజీఆర్ఎస్లో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీదారులతో కలెక్టర్ మాట్లాడారు. అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి సత్వరం పరిష్కరించేలా ఆదేశాలు ఇచ్చారు.
E.G: గోపాలపురం నియోజవర్గం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగే ఏర్పాట్లను సోమవారం గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం పరిశీలించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
NLR: కావలి మండలం మహిళా సమైక్య 20వ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో MLA కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆయన మహిళలు వేసిన ముగ్గులను పర్యవేక్షించి, ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి, వంటకాలను రుచి చూసి అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. కొంతమంది మహిళలు మాట్లాడుతూ.. ఇటువంటి సేవ చేసే MLAని తాము చూడలేదని, మా ఇంటి బిడ్డగా, మా అన్నగా వచ్చాడని ప్రశంసించారు.