• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు సబ్సిడీ లోన్లకు ఇంటర్వ్యూలు కార్యక్రమం

NLR: బీసీ, కాపు, ఈ బీసీ, తదితర కార్పొరేషన్ల నుండి సబ్సిడీ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ విడవలూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి నగేష్ కుమారి కీలక సూచనలు చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు సబ్సిడీ లోన్లకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సంబంధిత సర్టిఫికెట్లతో ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.

February 19, 2025 / 04:58 PM IST

రాజశేఖర్‌కి మద్దతుగా టీడీపీ నాయకులు ప్రచారం

కోనసీమ: ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ మద్దతుగా అమలాపురంలో టీడీపీ నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమలాపురం పట్టణంలో రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాజశేఖర్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు

February 19, 2025 / 04:57 PM IST

‘ప్రభుత్వానికి విక్రయించి గిట్టుబాటు ధర పొందండి’

NLR: వెంకటాచలం మండలం చవటపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు ధాన్యాన్ని ఆరబెట్టి ప్రభుత్వానికి విక్రయించి, గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.

February 19, 2025 / 04:56 PM IST

‘నాటుసారాతో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్’

ASR: నాటుసారాతో ముగ్గురు వ్యక్తులు పట్టుబడినట్లు బుధవారం అరకు ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం సాయంత్రం జరిపిన దాడులలో సుంకరమెట్ట పంచాయితీ కిన్నంగూడ జంక్షన్ వద్ద 62 లీటర్ల నాటుసారతో సుంకరమెట్టకు చెందిన బురిడి సోమయ్య, దుక్కగూడ గ్రామ వాసి పొట్టంగి సోమ, దండబాడుకు చెందిన చిట్టంనాయక్ లచ్చింధర్‌లు పట్టుబడినట్లు సీఐ పేర్కొన్నారు.

February 19, 2025 / 01:49 PM IST

ప్రత్యేక తరగతులను పరిశీలించిన ఎంఈవో

VZM: తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిరసిస్తున్న ప్రత్యేక తరగతులను బుధవారం మండల విద్యాధికారి జె. త్రినాధరావు తనిఖీ చేశారు. మార్చి నెలలో జరిగే పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 19, 2025 / 01:34 PM IST

కామవరపుకోటలో వైసీపీ నేతలతో సమీక్ష

ELR: కామవరపుకోట మండలం కళ్లచెరువులోని మాజీ ఏఎంసీ ఛైర్మన్ మేడవరపు అశోక్ ఇంట్లో వైసీపీ నేతల సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు హాజరయ్యారు. మండలంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మండలంలో పార్టీని ఎలా ముందుకు నడిపించాలి అనే అంశాలపై పలు సూచనలు చేశారు.

February 19, 2025 / 01:21 PM IST

రూ.74 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

NLR: జిల్లా రూరల్ పరిధిలోని 18వ డివిజన్లో బుధవారం రూ.74 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు నివాసముండే ప్రాంతాలలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

February 19, 2025 / 01:14 PM IST

‘పేర్లు నమోదు చేసుకోండి’

ప్రకాశం: సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్ట రైతుసేవా కేంద్రాలలో మండల వ్యవసాయ అధికారిణి పావని రైతు విశిష్ట గుర్తింపు కార్యక్రమాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వాలని నిర్ణయించింది. కావున రైతులందరూ రైతు సేవా కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు.

February 19, 2025 / 01:09 PM IST

నా సవాల్‌కు యరపతినేని స్పందించలేదు: కాసు

పల్నాడు: ఎన్నికల ముందు తన సవాల్‌‌కు గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు స్పందించలేదని మాజీ MLA కాసు మహేశ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కాసు బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. ఎన్నికల ముందు పిడుగురాళ్ల ప్రభుత్వం మెడికల్ కాలేజీకి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైనట్లు యరపతినేని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశానన్నారు.

February 19, 2025 / 12:58 PM IST

రేపు రాచర్లలో ప్రజా దర్బార్

ప్రకాశం: రాచర్లలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటల నుండి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయ సిబ్బంది బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ సమస్యలను ఎమ్మెల్యే పరిష్కరిస్తానని చెప్పారు.

February 19, 2025 / 12:54 PM IST

ఒంగోలు నగరంలో ఇద్దరు మంత్రుల భేటీ

ప్రకాశం: ఒంగోలులో నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న మంత్రి రవీంద్రను మరో మంత్రి స్వామి కలుసుకుని తాజా రాజకీయ అంశాలపై మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది.

February 19, 2025 / 12:53 PM IST

తొలి ప్రాధాన్యతా ఓటుతో ఆలపాటిని గెలిపించండి: శ్రావణ్

GNTR: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు అందరికీ ఎంతో అవసరమని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం ఫిరంగిపురంలోని మార్నింగ్ స్టార్ కళాశాల, దీనాపూర్ క్రిస్టియన్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ఓటు వేయాలని అధ్యాపకులను కోరారు. 

February 19, 2025 / 12:53 PM IST

చత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో సామినేని

NTR: జగ్గయ్యపేట పట్టణంలోని ముక్త్యాల రోడ్డు నందు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ చైతన్య వారి ఆధ్వర్యంలో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఇందులో తదితరులు పాల్గొన్నారు. 

February 19, 2025 / 11:31 AM IST

26న పొదిలి శివాలయంలో జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ సందడి

ప్రకాశం: ఈనెల 26న పొదిలి పట్టణంలోని శివాలయంలో జబర్దస్త్ టీం సందడి చేయనుందని జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ బుధవారం తెలిపారు. సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా.. శివాలయంలో జబర్దస్త్ టీం మెగా ఈవెంట్ నిర్వహిస్తుందని బుల్లెట్ భాస్కర్ తెలిపారు. తనతోపాటు జబర్దస్త్ టీం ఆటో రాంప్రసాద్, ఫైమా, నరేశ్ పాల్గొంటారని చెప్పారు.

February 19, 2025 / 10:17 AM IST

చిరుత పులుల కోసం ట్రాక్ కెమెరాలు

KDP: సింహాద్రిపురం, లింగాల, పులివెందుల మండలాల్లో రెండు చిరుత పులులు సంచరిస్తున్నాయని రైతులు తరచూ వాపోతున్న విషయం తెలిసిందే. చిరుతలను చూశామని తెలపడంతో ఫారెస్ట్ అధికారులు పొలాల్లో ట్రాక్ కెమెరాలు బిగించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మంగళవారం లింగాల, కామసముద్రం గ్రామాల్లో రెండు ట్రాక్ కెమెరాలను అధికారులు ఏర్పాట్లు చేశారు.

February 19, 2025 / 09:52 AM IST