TPT: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన “విలువల విద్యా సదస్సు”లో ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పాల్గొని విద్యార్థుల్లో నైతిక విలువల ప్రాధాన్యంపై ఉపన్యసించారు. జీవితంలో ధర్మం, క్రమశిక్షణ, బాధ్యతాభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డీఈవో, అధికారులు హాజరయ్యారు.