HNK: మెట్టు రామలింగేశ్వర స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత సామూహిక మహాన్యాస రుద్రాభిషేక పూజలు ఈ నెల 12న ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు సేవా సమితి అధ్యక్షుడు పెద్ది ప్రభాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు రుద్రాభిషేకం ప్రారంభమవుతుందని, కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.