PPM: ఆచార్య వినోబా భావే స్థాపించిన మహారాష్ట్రలోని పావనార్ ఆశ్రమం నుంచి “సర్వోదయ మండలి” సభ్యులు సద్భావన యాత్ర చేపట్టారు. ఈ యాత్ర రేపు మన జిల్లాలోకి రానుందని గాంధీజీ స్మారక నిధి ప్రధాన కార్యదర్శి నల్లా బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, అహింస, సామాజిక సామరస్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతోందని తెలిపారు.