ATP: జిల్లా మీదుగా నడిచే బెంగళూరు-కలబురగి (16563/64), బెంగళూరు-బీదర్ (16559/60), తిరుపతి-అకోలా (07605/06) ప్రత్యేక రైళ్లు ఇకపై సాధారణ ఛార్జీలు, రాయితీలతో రెగ్యులర్ రైళ్లుగా అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.