BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో వెలసిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.