SS: ధర్మవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు.