NLG: త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి పీహెచ్సీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. సర్పంచ్ గుండెబోయిన వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ క్యాంప్ను సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక నేతృత్వంలోని ఉచితంగా పరీక్షలు చేశారు.