• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

టిఫిన్ సెంటర్లపై అధికారుల దాడులు

VZM: పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై పౌర సరఫరా అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 19 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్వో మురళీనాధ్ తెలిపారు. ఏడు చోట్ల తనిఖీలు జరిపి 6-ఏ కేసులు నమోదు చేశామని, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 18, 2026 / 07:30 PM IST

‘విద్యార్థులు ఎక్కువగా విద్యపైన దృష్టి కేంద్రీకరించాలి’

CTR: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, రోడ్డు భద్రత, ధైర్య స్పర్శ చొరవపై దృష్టి సారించాయి. సురక్షితమైన ఆన్‌లైన్ పద్ధతులు, ట్రాఫిక్ నియమాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం వంటి క్రమశిక్షణ లక్షణాలు కలిగి ఉండాలన్నారు.

February 18, 2026 / 07:27 PM IST

రూరల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఐజీ

కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ లోని రికార్డులను డీఐజీ పరిశీలించి,రికార్డు నిర్వహణ ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని, కేసుల పరిష్కారంలో జాప్షం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డీఎస్పీ ధీరజ్ వినిల్, పాల్గొన్నారు.

February 18, 2026 / 07:24 PM IST

జనన, మరణాల నమోదుపై కొత్త రూల్స్: కమిషనర్

GNTR: రాష్ట్ర ప్రభుత్వం జనన, మరణాల నమోదుపై జీవోఎంఎస్ 28 ద్వారా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు కమిషనర్ మయూర్ అశోక్ బుధవారం తెలిపారు. జనన లేదా మరణం జరిగిన 21 రోజుల్లోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని, ఆ తర్వాత నిర్ణీత ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ 21 రోజులు దాటితే, రూ. 25 అపరాధ రుసుముతో 30 రోజులలోపు నమోదు చేసుకోవచ్చని వివరించారు.

February 18, 2026 / 07:20 PM IST

చీమకుర్తిలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం: చీమకుర్తిలో తూర్పు బైపాస్ రోడ్డు కూడలి నందు బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ మీద వెళుతున్న రాజేశ్, కోటయ్యలను ఢీకొంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రాంతంలో రోడ్డు బాగా దెబ్బ తినటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.

February 18, 2026 / 07:58 PM IST

ఈ నెల 22న బాపట్ల జిల్లా టీడీపీ ఆఫీస్‌కు శంకుస్థాపన

బాపట్లలో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బుధవారం వెల్లడించారు. ఇదే వేదికపై బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన రాజశేఖర్ బాబు ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఈ రెండు కీలక కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

February 18, 2026 / 07:04 PM IST

రేపు వేల్పూరులో వైఎస్ షర్మిల పర్యటన

PLD: ఉపాధిహామీ పథకంపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి రానున్నారు. ఈ మేరకు వినుకొండ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రామాంజనేయులు వివరాలు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాలపై భారం మోపుతోందని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన విమర్శించారు.

February 18, 2026 / 07:01 PM IST

ప్రతి రైతుకు ఆధార్ లాంటి విశిష్ట సంఖ్య అవసరం

GNTR: ఫిరంగిపురం మండలంలోని నుదురుపాడు గ్రామాన్ని గుంటూరు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎం. పద్మావతి సందర్శించి ,రైతు సేవా కేంద్రం ద్వారా రైతుల విశిష్ట నమోదు సంఖ్య నమోదు ప్రక్రియను పరిశీలించారు. పొలం ఉన్న రైతు ఈ నెలాఖరు లోపు రైతు సేవా కేంద్రాల వ్యవసాయ సహాయకుల ద్వారా ఏపీ ఎఫ్.ఆర్ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

February 18, 2026 / 07:00 PM IST

వాడపల్లి వెంకన్నను దర్శించిన మాస్టర్ శేఖర్

కోనసీమ: అత్రేయపురం(మం) పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులు బుధవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు.

February 18, 2026 / 06:52 PM IST

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

E.G: గోకవరం మండలం గుమ్మల దొడ్డి గ్రామపంచాయతీ నందు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీపీ ఈది. రత్న అశోక్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 30 లక్షలుతో ఈ సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

February 18, 2026 / 06:06 PM IST

ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు

కోనసీమ: అమలాపురంలోని APSRTC బస్ డిపో వద్ద ఏవి డ్రైవింగ్ స్కూల్ నందు 12వ బ్యాచ్‌కు సంబంధించిన 16 మంది అభ్యర్థులు 32 రోజుల శిక్షణను పూర్తి చేసుకున్నారు. వారికి అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు సర్టిఫికెట్లు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్లు భాస్కర్ రావు, శర్మ, అధికారులు పాల్గొన్నారు.

February 18, 2026 / 05:33 PM IST