సత్యసాయి: మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కృషితోనే ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరణ సాధ్యమైందని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ సంస్థను నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు క్రెడిట్ కోసం జగన్ ట్వీట్ చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు.