NLR: బుచ్చిరెడ్డిపాళెం పురపాలక పరిధిలో అక్రమ కుళాయి కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. పట్టణ వ్యాప్తంగా 9,632 గృహాలు ఉండగా 4,201 కుళాయిలు కనెక్షన్లు ఉన్నాయి. అక్రమ కనెక్షన్లు ఉన్నాయని అధికారుల సర్వేలో తేటతెల్లమైంది. ప్రత్యేక డ్రైవ్లో వాటిని గుర్తించామని క్రమబద్ధీకరించేలా చర్యలు చేపడతామని నగర కమిషనర్ బాలకృష్ణ వెల్లడించారు.
NLR: బుచ్చిరెడ్డిపాళెం పురపాలక పరిధిలో అక్రమ కుళాయి కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. పట్టణ వ్యాప్తంగా 9,632 గృహాలు ఉండగా 4,201 కుళాయిలు కనెక్షన్లు ఉన్నాయి. అక్రమ కనెక్షన్లు ఉన్నాయని అధికారుల సర్వేలో తేటతెల్లమైంది. ప్రత్యేక డ్రైవ్లో వాటిని గుర్తించామని క్రమబద్ధీకరించేలా చర్యలు చేపడతామని నగర కమిషనర్ బాలకృష్ణ వెల్లడించారు.
ప్రకాశం: కొమరోలు మండలంలోని రావురిపాలెం, రెడ్డి చర్ల గ్రామాలలో గల పంటలను ఉద్యాన శాఖ అధికారి శ్వేత బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని టమాటా పంటను ఆమె పరిశీలించి, పంటలో మంచి దిగుబడి రావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ప్రకాశం: కొమరోలు మండలంలోని రావురిపాలెం, రెడ్డి చర్ల గ్రామాలలో గల పంటలను ఉద్యాన శాఖ అధికారి శ్వేత బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని టమాటా పంటను ఆమె పరిశీలించి, పంటలో మంచి దిగుబడి రావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
కోనసీమ: ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జరుగుతున్న అరిగెల శ్రీ రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను రాత్రి అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి తిలకించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ టీమ్ క్రీడాకారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఈ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. జిల్లాలో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందేలా కృషి చేస్తానని ఎంపీ తెలిపారు.
కోనసీమ: ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. అన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు ప్రధానంగా డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ప్రకాశం: ముస్లింలు రంజాన్ పండగను భక్తిశ్రద్ధ లతో జరుపుకోవాలని దర్శి సీఐ వై.రామారావు కోరారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో ప్రసిద్ధి చెందిన మర్కజ్ మసీద్ వద్ద బుధవారం రాత్రి ముస్లింలతో నూతన చట్టాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోలీసులు ప్రతి ముస్లిం ఇంటికి నమాజ్ పుస్తకం పంపిణీ చేశారు.
ప్రకాశం: ముస్లింలు రంజాన్ పండగను భక్తిశ్రద్ధ లతో జరుపుకోవాలని దర్శి సీఐ వై.రామారావు కోరారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో ప్రసిద్ధి చెందిన మర్కజ్ మసీద్ వద్ద బుధవారం రాత్రి ముస్లింలతో నూతన చట్టాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోలీసులు ప్రతి ముస్లిం ఇంటికి నమాజ్ పుస్తకం పంపిణీ చేశారు.
కోనసీమ: ఐ.పోలవరం మండలం ఎదుర్లంక చెక్ పోస్ట్ వద్ద యానాం నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 790 లీటర్ల డీజిల్, 80 లీటర్ల పెట్రోల్ను బుధవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రవీంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, రాంబాబులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కోనసీమ: ఈ నెల 22న రామచంద్రపురం ఉపాధి భవన్లో మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. 18 నుంచి 27 ఏళ్ల లోపు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ , ఐటిఐ చదివిన అభ్యర్థులకు రూ.18 వేల జీతంతో షిఫ్ట్ టైంలో భోజన, రవాణా సదుపాయం కల్పించే విధంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.
CTR: పలమనేరులో ఈనెల 19వ తేదీన ఛత్రపతి శివాజీ శోభాయాత్రను నిర్వహించనున్నట్లు హిందూ సంఘాల సభ్యులు తెలిపారు. ఈ శోభాయాత్ర పలమనేరు లయన్స్ క్లబ్ నుంచి ప్రారంభమై, రెక్కమాను సర్కిల్, జిలాని సర్కిల్, పెట్రోల్ బంక్, యంబీటి రోడ్డు, జవిలి వీధి మీదుగా తిరిగి లయన్స్ క్లబ్ వద్దకు చేరుకుంటుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి హిందూ బంధువులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
GNTR: కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం తెనాలిలో విస్తృతంగా పర్యటించారు. బుర్రిపాలెంలోని టిడ్కో లేఔట్ను పరిశీలించి, నిర్మాణంలో ఉన్న 2,880 ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రంతో పాటు మురుగునీటి శుద్ధి ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు.
E.G: కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ భావన రత్నకుమారి, 3, 5, 19, 20వ వార్డు YCP కౌన్సిలర్లు బుధవారం టీడీపీలోకి చేరారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి రాష్ట్ర TDP అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం సీఐటీయూ మండల కన్వినర్ నరేంద్ర ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. నరేంద్ర మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ ఏర్పాటు చేసి మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించే విధానం చేయాలన్నారు.
కోనసీమ: ఆలమూరు(మం) లంక గ్రామాలకు ఎంతో ప్రయోజనకరమైన చెముడులంక వంతెన అప్రోచ్ రోడ్డుకు రూ. 30 లక్షలు మంజూరయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ నిధులను మంజూరు చేయించారు. ఏటిగట్టు అవతల ఉన్న బడుగువానిలంక గ్రామ ప్రజలతో పాటు, చెముడులంక, మడికి, పొట్టిలంక తదితర రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.