తిరుమలలో బుధవారం టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం మొత్తం 78,381 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 25,451 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లుగా నమోదైంది.