AP: ఈనెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక తీర్మానం చేయనుంది. కొంతకాలంగా కొనసాగుతున్న రాజధాని సందిగ్ధతను తెర దించుతూ.. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఈ తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అనంతరం తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు పంపిస్తారు.