సత్యసాయి: ధర్మవరం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. రైల్వే శాఖలో GRP సీఐగా పనిచేస్తున్న అశోక్ కుమార్ భార్య చాముండేశ్వరి బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంలోనే ఆమె ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.