KDP: రాజంపేటలో రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. “చమర్తి మార్నింగ్ వాక్” కార్యక్రమంలో భాగంగా అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే భవన యజమానులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.