AP: అనంతపురం జిల్లాలో మద్యానికి బానిసైన భర్త(హనుమంతు)ను.. భార్యే చంపి పాతి పెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. రెవెన్యూ అధికారుల సమక్షంలో నిందితురాలు చూపిన చోట తవ్వకాలు జరిపారు. హనుమంతు మృతదేహాన్ని బయటకు తీసి ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించారు. అనంతరం అవశేషాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.