NDL: సంజామల మండల పరిధిలోని మంగపల్లెలో ఆదివారం నిర్వహించిన 66వ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు డైరెక్టర్ పి.షేక్షావలి రెడ్డి తెలిపారు. శిబిరానికి విచ్చేసిన 1000 మందికిపైగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మెడిసిన్, భోజన వసతి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తండ్రి డా. దస్తగిరి రెడ్డి సహకారంతో ప్రజలకు సేవ చేయడం అదృష్టమన్నారు.