AP: అప్పలాయగుంట ఆలయంలో ‘సన్నిధి గొల్ల’కు తొలి దర్శనం దూరం అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను టీటీడీ ఖండించింది. ఆ ఆలయంలో అసలు ఆ పదవే లేదని, వార్తల్లో ఉన్న వ్యక్తి కేవలం ఒక కాంట్రాక్ట్ వర్కర్ మాత్రమేనని స్పష్టం చేసింది. భక్తుల ఫిర్యాదుల మేరకే సదరు వ్యక్తిని కాంట్రాక్టర్ తొలగించారని, విజిలెన్స్ అధికారులు నిర్బంధించారన్నది అవాస్తవమని ప్రకటనలో తెలిపింది.