బాపట్ల: ఇంకొల్లులో బుధవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను తహసీల్దార్ ఏవీఎస్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు జరగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.