తిరుపతి జిల్లాలో ప్రైవేట్ లా కళాశాలలు విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని SVU విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా VC నర్సింగరావుకు వినతి పత్రం అందజేశారు. కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే రెండింతలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.