KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని కర్నూలు బైపాస్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న రెడ్డి జన సంఘం కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ స్థలాన్ని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇవాళ సందర్శించారు. సంఘం సభ్యులు, స్థానిక ప్రజలతో సమావేశమై నిర్మాణ పనులపై చర్చించారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించి, అవసరమైన నిధులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.