AKP: గొలుగొండ ఎస్సీ కాలనీలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ పేరుతో సామాజిక భవనం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. జిల్లా పరిషత్ ఛైర్మన్ స్పెషల్ నిధుల నుంచి రూ.10 లక్షలతో చేపట్టనున్న ఈ పనులను ఎంపీపీ గజ్జలపు మణికుమారి, సర్పంచ్ కసిపల్లి అప్పారావు ప్రారంభించారు. భవనం నిర్మాణంతో కాలనీ ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయని వారు తెలిపారు.