ATP: రాయదుర్గం పురపాలక సంఘం పరిధిలో దినసరి కూరగాయల మార్కెట్, వారపు సంత రుసుం వసూలు హక్కుల కోసం బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో మల్లికార్జున అనే వ్యక్తి హక్కులను దక్కించుకున్నారు. దినసరి మార్కెట్ను రూ.31.70 లక్షలకు, వారపు సంతను రూ.11.50 లక్షలకు ఆయన పాట పాడి సొంతం చేసుకున్నారు.