GNTR: పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన వివిధ మార్కెట్ల వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు బుధవారం తెలిపారు. కూరగాయల మార్కెట్, సండ్రీ మార్కెట్, మాంసము మార్కెట్, చేపల మార్కెట్, జంతు వధశాలలకు వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలకు మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.