NDL: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల విలేఖరి రామారావుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ మద్దయ్య, బనగానపల్లె నియోజకవర్గం అధ్యక్షులు సర్వేశ్వర రెడ్డిలు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీదేవికి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
కృష్ణా: విజయవాడ గాంధీనగర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి వంశీతో ములాఖత్ కానున్న నేపథ్యంలో పోలీసులు బారీకేడ్లు పెట్టారు. అయితే మద్యం మత్తులో ఓ వ్యక్తి రాయితో తలపై కొట్టుకున్నాడు. గేట్లు తెరవాలని హల్ చల్ చేశాడు. దీంతో మందు బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు.
GNTR: మేడికొండూరు మండలం పేరెచర్ల గ్రామం విశ్వభారతి ఫార్మసీ కాలేజీలో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్కి ఓటు వేసి గెలిపించాలని అధ్యాపకులను కోరారు.
ASR: మన్యం జిల్లా మక్కువ మండల విలేకరిపై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ఏపీటీఆర్ఏ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు శెట్టి మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను బయట పెట్టిన జర్నలిస్టులపై దాడి చేయడం సరికాదని తీవ్రంగా ఖండించారు. తక్షణమే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
SKLM: రణస్థలంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లావేరుకు చెందిన ఓ పాప బ్రెయిన్ సర్జరీ నిమిత్తం రూ.1,57,000 చెక్కును అందజేయడం జరిగిందన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఈ సహాయం అందించిందన్నారు.
కృష్ణా: బీసీ, ఈబీసీ విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రాష్ట్ర వాటా కింద కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి 3.25 లక్షల మంది విద్యార్థులను జగన్ దగా చేశాడని టీడీపీ నేత బెజవాడ నజీర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వేతనాల బకాయిలు మొత్తం రూ.254.48 కోట్లు విడుదల చేసేందుకు కూటమి నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
W.G: తణుకు పట్టణానికి చెందిన రూట్స్ స్కూలు ప్రిన్సిపాల్ ఎల్కే త్రిపాఠికి గురుబ్రహ్మ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును అందజేశారు. సోమవారం హైదరాబాదు లలితకళాతోరణం ఆడిటోరియంలో నిర్వహించిన సీవీ రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రముఖ నటుడు రావురమేష్ చేతుల మీదుగా త్రిపాఠి అవార్డు అందుకున్నారు.
గజపతినగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి పై శిక్షణ తరగతులను మండల విద్యాశాఖ అధికారులు విమలమ్మ, సాయి చక్రధర్ నిర్వహించారు. రిసోర్స్ పర్సన్స్గా మీసాల శివాజీ, మంత్రి అప్పలనాయుడులు వ్యవహరించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్లు రమాకుమారి, శ్యామల హైమావతిలు డీఆర్పిలుగా వ్యవహరించారు.
VZM: ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎల్కోట ఆమె క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ మేరకు వేపాడ మండలం కరకవలసకు చెందిన పాము రోహిత్ కుమార్కు మంజూరైన రూ.1,16,040 చెక్కును లబ్ధిదారుడకు అందజేశారు. సీఎం సహాయనిధి పేద ప్రజలకు ఆపన్నహస్తమని కొనియాడారు. గత ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
ATP: అనంతపురం త్రీటౌన్ పోలీసులు భూ కబ్జాదారులపై కొరడా ఝులిపించారు. CI శాంతిలాల్ వివరాల మేరకు.. విద్యారణ్య నగర్లో విజయకృష్ణకు చెందిన భూమిని కొంత మంది వ్యక్తులు ప్రజా సంఘం ముసుగులో ఆక్రమించారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై భూకబ్జా కేసులు నమోదు చేశామన్నారు. భూకబ్జాలపై ఏమాత్రం సహించమని అవసరమైతే PD యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు.
KDP: రాజుపాలెం మండలంలో మిస్సింగ్ కేసు నమోదైంది. కొర్రపాడు గ్రామానికి చెందిన దద్దనాల జమీల అనే మహిళ, ఆమె పిల్లలు కమాల్ బాషా (8), మదియా (6) ఆదివారం నుంచి కనపడకుండా పోయారని రాజుపాలెం ఎస్ఐ కత్తి వెంకట రమణ తెలిపారు. ఈ విషయమై రాజుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు 91211 00600 నంబర్కు సమాచారం అందించాలని కోరారు.
పార్వతీపురంమండలంలోని తాళ్లబురిడి గ్రామంలో ఆరవిల్లి శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు అయ్యల స్వామి యాజుల శ్రీనివాసశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు బసవ రాజుల పర్యవేక్షణలో శివాలయ ప్రతిష్ట పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూడు రోజుల నుంచి గ్రామస్తుల సహాయ సహకారాలతో శివాలయపునఃప్రతిష్ట పూజలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
NDL: పట్టణంలోని చిన్నచెరువు వద్ద ఉన్న వినాయక ఘాట్లో యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బిల్లలపురంకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చరణ్(25)గా గుర్తించారు. ఆత్మహత్య లేదా ఇతర కారణాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
VZM: వంట గ్యాస్ లీకై ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కొత్తవలస మండలంలో చోటు చేసుకుంది. కంటకాపల్లిలో సోమవారం జరిగిన అమ్మవారి తీర్థ మహోత్సవాలు సందర్భంగా బాడితబోని మల్లయ్య ఇంట్లో పిండి వంటలు తయారు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని శారదా కంపెనీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
VZM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబందించి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ పత్రాల తనిఖీ కార్యక్రమం నేడు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో చేపట్టారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. బిఆర్. అంబేద్కర్ తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. డీఆర్ఓ ఎస్. శ్రీనివాసమూర్తి, ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు పాల్గొన్నారు.