• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి

ASR: సాలూరు నియోజకవర్గ ప్రజల చిరకాల కల నెరవేరిందని మంత్రి సంధ్యారాణి అన్నారు. అత్యుత్తమ వైద్య సేవలను స్థానికులకు అందుబాటులోకి తీసుకువస్తూ, సుమారు రూ. 17 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల అత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి పాల్గొన్నారు.

March 20, 2026 / 04:20 PM IST

సదరం పరిధిలోకి మరో ఐదు వైకల్యాలు: మంత్రి

సత్యసాయి: మరో ఐదు రకాల వైకల్యాలను సదరం పరిధిలోకి చేర్చినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. యాసిడ్ దాడి బాధితులు, ఆటిజం, లెర్నింగ్ డిజార్డర్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్, బహుళ వైకల్యాల వారికి డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ నెల 25 నుంచి స్లాట్ బుకింగ్, 30 నుంచి వైద్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.

March 20, 2026 / 04:20 PM IST

జిల్లా కార్యాలయంలో ఫైళ్లు అదృశ్యం..?

SKLM: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో బదిలీలకు సంబంధించిన ఫైళ్లు మాయం అవటంతో గందరగోళం నెలకొంది. ఇటీవల వివాదాలకు అడ్డాగా మారిన ఈ కార్యాలయం పనితీరుపై ఎస్టీ కమిషన్ ఇటీవల విచారణ జరిపి సిబ్బంది పనితీరుపై మొట్టికాయలు వేసింది. ఇంత జరిగినా… బదిలీల ఫైళ్లు మాయం అవటం, ఆ విషయంలో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకపోవటంతో అనేక అనుమానలు వ్యక్తం అవుతున్నాయి.

March 20, 2026 / 04:15 PM IST

శ్రీరామ కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

AKP: నర్సీపట్నంలోని 18వ శతాబ్దం నాటి చారిత్రాత్మక శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని కల్యాణోత్సవం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉదయం 7 గంటలకు స్వామి వారి తిరువీధి మహోత్సవం ఉంటుందన్నారు.

March 20, 2026 / 04:14 PM IST

ఈనెల 22న APWJF జిల్లా మహాసభ

TPT: జర్నలిస్టుల హక్కుల సాధన కోసం “కలిసినడదాం-మన హక్కులు సాధిద్దాం” అనే నినాదంతో ఈనెల 22న ఆదివారం తిరుపతి రాస్ బిల్డింగ్‌లో APWJF జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు APWJF అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం తెలిపారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరూ హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

March 20, 2026 / 04:11 PM IST

ప్రాధాన్యతల వారీగా సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే

అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన విన్నపాలను పరిశీలించి, ప్రాధాన్యతల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తీరుస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

March 20, 2026 / 04:04 PM IST

‘నూతన ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలి’

ELR: పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ స్థలంలో నూతన ఫ్యాక్టరీని నిర్మించాలని IFTU ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం IFTU అనుబంధ సంఘాలతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఫ్యాక్టరీ ఉన్న స్థలంలో ఆధునిక టెక్నాలజీతో నూతన ఫ్యాక్టరీని నిర్మించాలని, ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు.

March 20, 2026 / 04:04 PM IST

కొమరోలు మండలంలో అరటి పంట నష్టం అంచనా

ప్రకాశం: కొమరోలు మండలంలోని అరటి పంటను శుక్రవారం ఉద్యాన శాఖ అధికారి శ్వేత పరిశీలించారు. ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షానికి జరిగిన అరటి పంట నష్టంను ఆమె అంచనా వేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం 20 హెక్టార్ల వరకు అరటిపంట నష్టం జరిగిందని ప్రాథమిక నివేదిక జిల్లా ఉద్యాన శాఖ అధికారికి పంపుతానని ఆమె అన్నారు.

March 20, 2026 / 04:00 PM IST

అస్వస్థతతో కుప్పకూలిన వ్యక్తి

కృష్ణా: గుడివాడ వెటర్నరీ ఆసుపత్రి సమీపంలో అప్పలనాయుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే 108లో ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన గీతా భవన్ రోడ్డులో నివాసం ఉంటున్నట్లు సమాచారం. అప్పలనాయుడు గురించి తెలిసిన వారు లేదా బంధువులు వెంటనే వన్ టౌన్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు ఈరోజు కోరారు.

March 20, 2026 / 04:00 PM IST

కళా రత్న పురస్కార గ్రహీతకు ఘన సత్కారం

NTR: నందిగామలో కళారత్న పురస్కార గ్రహీత బొబ్బిళ్ళపాటి సాయిని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శుక్రవారం ఘనంగా సత్కరించారు. పరాభవ నామ సంవత్సర కళారత్న పురస్కారం–2026 అందుకున్న సందర్భంగా శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కళారంగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి గౌరవం పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. సాయి నందిగామకు మంచి గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు.

March 20, 2026 / 04:00 PM IST

‘పల్లె పండుగ 2.0’లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

E.G: రాజానగరం మండలం పాత తుంగపాడు గ్రామంలో పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం గ్రామంలో పర్యటిస్తూ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య గురించి తెలుసుకుని పరిష్కారం చూపించారు. రాబోయే వేసవి కాలంలో విద్యుత్ కోతలు లేకుండా 24/7 విద్యుత్ అందించేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 20, 2026 / 04:00 PM IST

ఏప్రిల్ 7న కొండపాటూరులో పోలేరమ్మతల్లి తిరునాళ్లు

GNTR: కాకుమాను మండలం కొండపాటూరులో పోలేరమ్మ తల్లి తిరునాళ్లు ఏప్రిల్ 7న నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ పొన్నం వీరయ్యచౌదరి, ఈవో జక్కా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం పంచాంగ శ్రవణం అనంతరం పోస్టర్ విడుదల చేశారు. ఈ నెల 31న మల్లెల పూజ, ఏప్రిల్ 3న కుంకుమ పూజ జరుగుతుంది. పూజా సామగ్రి ఆలయం నుంచి అందిస్తారన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

March 20, 2026 / 04:00 PM IST

ఈ నెల 22న అభివృద్ధి పనులు ప్రారంభం: కోటంరెడ్డి

నెల్లూరూలో రూ. 27 కోట్లతో చేపట్టిన 240 అభివృద్ధి పనులను ఈనెల 22న ప్రారంభించనున్నట్లు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు రూరల్‌లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ ఉంటుందన్నారు.

March 20, 2026 / 04:00 PM IST

మార్చి 24న ఆందోళనలు విజయవంతం చేయాలి: సీపీఐ

BPT: అర్హులైన పేదలకు ఇళ్లు, ఇంటి స్థలం, సాగుభూమి కల్పించాలనే డిమాండ్‌తో మార్చి 24న రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆందోళనలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పిలుపునిచ్చారు. పట్టణాల్లో రెండు సెట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు.

March 20, 2026 / 04:00 PM IST

పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 43 ఫిర్యాదులు

ASR: పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 43 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ దినేష్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

March 20, 2026 / 04:00 PM IST