GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబు సోమవారం గుంటూరు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో జరిగే PGRS కార్యక్రమానికి హాజరుకానున్నారు. తన ఇంటిపై జరిగిన దాడి, అరెస్ట్ సమయంలో పోలీసుల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తూ పూర్తి విచారణ కోరనున్నారు. ఈ పరిణామాలతో జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత మళ్లీ పెరిగింది.
BPT: యద్దనపూడిలో పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని ఎస్సై రత్న కుమారి తెలిపారు. ఆదివారం బహిరంగంగా మద్యం సేవిస్తున్న పలువురిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
VZM: ఈ నెల 25న AP SIRD ఆదేశాల మేరకు గంట్యాడ మండల పరిధిలోని MPTCలు, సర్పంచ్లు, వార్డ్ మెంబర్లకు గ్రామ స్థాయిలో మంచి నీటి రక్షణపై శిక్షణ ఇస్తున్నట్లు స్థానిక MPDO ఆర్వీ.రమణమూర్తి తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆరోజు తమ కార్యాలయంలోనే ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని, మండల పరిధిలో ఉన్న సర్పంచ్లు, MPTC, వార్డు మెంబర్లు హాజరుకావాలన్నారు.
ATP: వజ్రకరూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు 200 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 150 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
AKP: మాజీ మంత్రి దివంగత గుడివాడ గుర్నాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం మాట్లాడుతూ.. కొందరు దుండగులు అల్లర్లు సృష్టించేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
శ్రీకాకుళం నగరం పాల కొండ రోడ్డులోని కోదండ రామాలయంలో సోమవారం నుంచి కోదండ రాముడి కల్యాణోత్సవాలు, శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నట్లు అర్చకులు బంకుపల్లి శేషాచార్యులు తెలిపారు. 27న శ్రీరామ చంద్ర మూర్తి కల్యాణం, 29న వార్షిక కల్యాణం, 31న రథోత్సవం, ఏప్రిల్ 2న పట్టాభిషేకం, 3న పుష్పయాగ మహోత్సవం జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
SKLM: పలాస(M) తర్లాకోటలో ఆదివారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళ తమ సెల్ ఫోన్లో నారి శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.
సత్యసాయి: రాష్ట్రంలోని చేనేత కళాకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి ఎస్. సవిత తెలిపారు. విజయవాడలో నిర్వహిస్తున్న గాంధీ బునకర్ మేళాను ఆమె సందర్శించారు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు రూ. 4,000 పెన్షన్, ఏప్రిల్ నుంచి ఉచిత విద్యుత్ అందించనున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజుల్లోనే రూ. 47.35 లక్షల అమ్మకాలు జరగడంపై హర్షం వ్యక్తం చేశారు.
BPT: పేద విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాపట్లలో వివిధ ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన పథకాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.
VSP: గాజువాకలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కూటమి నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కూటమి బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి లక్ష్యాలపై నాయకులతో చర్చించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు.
TPT: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గజవాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారు గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందుకు సాగుతుండగా భజన బృందాలు కోలాటాలు ఆడుతూ ఉత్సవాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దాయి.
VZM: దేహదారుఢ్యంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఆదివారం రింగ్ రోడ్లో విశాల్ మార్ట్ పై అంతస్తులో నూతనంగా అత్యాధునికమైన పరికరాలతో ఏర్పాటు చేసిన జిమ్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
CTR: సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె ఎంపీపీ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో నిర్వాహకులు 100 మంది రోగులకు పరీక్షలు నిర్వహించారు. కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. వీరికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నిత్య అన్నదానం ట్రస్ట్కు రూ.1,00,000 విరాళాన్ని నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన దాత రాజశేఖర్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతకు దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
AKP: జిల్లాలో రేపు పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు వస్తున్న నేపథ్యంలో అధికారులు పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలిపారు. ఈ కారణంగా వీటిని రద్దు చేస్తున్నామన్నారు.