ASR: పాడేరు ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద అంగన్వాడీలు సోమవారం రిలే నిరాహార దీక్షకు దిగారు. రూ.26వేల కనీస వేతనం, 1810 మినీ కేంద్రాల అప్గ్రేడేషన్, గ్రాట్యుటీ మార్గదర్శకాలు, వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్తో పాటు రూరల్, అర్బన్ తేడాలేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ATP: కర్నూలు జిల్లాకు చెందిన న్యాయవాది పవన్ కుమార్పై సీఐ విక్రమసింహా దౌర్జన్యం చేసినందుకు నిరసనగా తాడిపత్రి న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సోమవారం కోర్టు కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదుల పట్ల జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు.
NLR: నెల్లూరులోని 26వ డివిజన్ విక్రమ్ నగర్ ప్రాంతంలో కార్పొరేషన్ నందన్ అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు. డివిజన్ పరిధిలో అన్ని భవనాలను అసెస్మెంట్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. 100% నిర్దేశించిన ఆస్తి, తాగునీటి కుళాయి, ఖాళీ స్థలం పన్నులను వసూళ్లు చేయాలని ఆదేశించారు.
సత్యసాయి: వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ప్రారంభించినట్లు కదిరి డీఎస్పీ శివన్నారాయణ స్వామి తెలిపారు. సోమవారం జాతీయ రహదారిపై డీఎస్పీ కార్యాలయం ముందు రెండు చలివేంద్రాలను అధికారులు ప్రారంభించారు. ఎంపీడీఓ పొలప్ప, గురురాజు గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
కోనసీమ: కే. గంగవరం మండలంలోని తామరపల్లి గ్రామంలో ప్రజల రాగినీటి సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ తోకల మంగ శ్రీనివాస్ తెలిపారు. సర్పంచ్ స్థానిక నాయకులతో కలిసి సోమవారం గ్రామంలో నూతనంగా నిర్వహించనున్న సురక్షిత త్రాగు నీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాయకులు నెక్కంటి బాలకృష్ణ, గన్ని శ్రీనివాస్ పాల్గొన్నారు.
E.G: కర్నూలులో న్యాయవాది ఎం.పవన్ కుమార్పై 4వ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ, సిబ్బంది దాడి చేయడం హేయకరమని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ఘటనను నిరసిస్తూ సోమవారం సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు, న్యాయవాదులు రాజమండ్రి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. న్యాయవాదులు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
TPT: సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద షాపుల ముందు ఉంచిన కంటైనర్ వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం తాత్కాలిక చర్యగా దీనిని ఏర్పాటు చేశామని టోల్ అధికారులు చెబుతున్నా, ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కంటైనర్ కారణంగా రహదారి వెడల్పు తగ్గి వాహనాలు నిలిచిపోవడంతో రద్దీ మరింత పెరిగిందని స్థానికులు అంటున్నారు.
కృష్ణా: పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ములుపూరి గోవింద ప్రభాకర్ రావు మరణించారు. ఆయన అంతిమయాత్ర మంగళవారం ఉదయం 9 గంటలకు కపిలేశ్వరపురం గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభాకర్ రావుకు నివాళులర్పించి.. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన అంకితభావంతో సేవలందించారని నాయకులు కొనియాడారు.
TPT: సూళ్లూరుపేటలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంపై తీవ్ర వివాదం చోటుచేసుకుంది. సత్యం జూనియర్ కళాశాలకు చెందిన మొత్తం 233 మంది విద్యార్థుల్లో 227 మందిని ఒకే ప్రైవేట్ కళాశాలలో పరీక్షలు రాయడానికి కేటాయించడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కొన్ని పాఠశాలలు పట్ల వివక్షత చూపుతున్నరన్నారు.
KDP: బద్వేల్లో మొదటి రోజు ప్రశాంతంగా పూర్తయిన ఇంటర్ పరీక్షలు ఎస్కేపి జూనియర్ కళాశాల, గౌతమ్, బీజేఎస్ఆర్, శ్రీ గాయత్రి కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై నాగ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసుల సీసీ కెమెరాల నిఘా ఉంచారు.
TPT: ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా వరదరాజ నగర్లోని నారాయణ జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వైద్య సిబ్బంది, త్రాగునీరు, భద్రతా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
ATP: అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ఇద్దరు హిజ్రాలకు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఐడి కార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతపురానికి చెందిన శాంతి, కూడేరుకు చెందిన ఆద్య ఈ కార్డులను అందుకున్నారు. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న హిజ్రాలందరికీ తక్షణమే ఐడి కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
VZM: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 28వ తేదీన చీపురుపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ ఏర్పాట్లను, మీటింగ్ స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎడిషనల్ ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీ, మండల అధికారులు పాల్గొన్నారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ మహిళా విభాగం ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మల్ల ధనలత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయ ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు. కమిటీల నిర్మాణం త్వరగా పూర్తి చేసి వార్డు స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు తెలిపారు.
AKP: రాంబిల్లి మండలం సీతంపాలెంలో ఈనెల 28వ తేదీన బ్లూ జెట్ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వస్తున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మంత్రి లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.