ATP: అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ఇద్దరు హిజ్రాలకు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఐడి కార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతపురానికి చెందిన శాంతి, కూడేరుకు చెందిన ఆద్య ఈ కార్డులను అందుకున్నారు. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న హిజ్రాలందరికీ తక్షణమే ఐడి కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు.