NDL: పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ వద్ద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం ఆయన విగ్రహానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పుష్పమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలు చిరస్మణీయమన్నారు. జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తిక్, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.