NDL: నందికొట్కూరు పట్టణం ABM పాలెంకు చెందిన ఇద్దరికీ రూ. 91,000 విలువైన CMRF చెక్కులను శనివారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య అందజేశారు. ఆపదలో ఉన్న నిరుపేదలకు ఈ నిధులు కొండంత అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సురేంద్ర నాథ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.