SKLM: జి.సిగడాం మండలం నడిమవలస పంచాయతీకి చెందిన సివిల్స్ విజేత సౌరోతు రాము ఇవాళ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనను సన్మానించి, మాట్లాడారు. సామాన్య కుటుంబంలో పుట్టి అహర్నిశలు శ్రమించి ఉన్నత లక్ష్యానికి పేదరికం అడ్డు కాదని నిరూపించిన వ్యక్తి రాము అని తెలిపారు. రాముని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.