AP: అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామని, భవిష్యత్తు కోసం అక్కడ 5000 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మిస్తున్నామని CM చంద్రబాబు తెలిపారు. తమిళనాడు ప్రచారంలో భాగంగా.. కోయంబత్తూరులో కేవలం 500 ఎకరాల్లో విమానాశ్రయం ఉండటం అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. దూరదృష్టితో ఇక్కడ కూడా మెగా ఎయిర్పోర్ట్ నిర్మించాలని, పాలకుల వెనకడుగు వల్ల రాష్ట్ర భవిష్యత్తు ఆగిపోకూడదన్నారు.