NDL: ప్యాపిలి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి శనివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామం, వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.