GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహిళా విద్యకు మార్గదర్శిగా నిలిచిన మహాత్మా పూలే సేవలు అపారమని కొనియాడారు.