TPT: వాకాడులో వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి శనివారం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు.