కడపలో రూ.5 కోట్ల అభివృద్ధి పనుల టెండర్లను అధికారులు ఏకపక్షంగా రద్దు చేయడంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. జనరల్ బాడీ ఆమోదించిన పనులను నిలిపివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించింది. కేంద్ర నిధులతో చేపట్టాల్సిన పనులు ఎందుకు ఆపారో సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేసింది. అవసరమైతే ముట్టడి, న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించింది.