మార్కాపురంలోని కొండేపల్లి రోడ్డులో శ్రీ పట్టాభిరామస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తుల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కందుల నారాయణరెడ్డి తన సతీమణి వసంతమ్మతో కలిసి పాల్గొన్నారు. మహోత్సవ కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు.