SS: జిల్లా వైసీపీ అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీ చరణ్ సోమవారం గోరంట్ల మండలంలోని మల్లాపల్లి పంచాయతీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటనను జయప్రదం చేయాలని మండల కన్వీనర్ పగడాల వెంకటేష్, టౌన్ కన్వీనర్ మేదర శంకర పిలుపునిచ్చారు.