KDP: ప్రొద్దుటూరులో శనివారం ఉదయం ‘జ్యోతిరావు పూలే’ జయంతి కార్యక్రమంలో స్థానిక MLA నంద్యాల వరదరాజులరెడ్డి పాల్గొన్నారు. స్థానిక మైదుకూరు రోడ్డులోని విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిస్తామన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు ముక్తియార్, రాజగోపాల్ పాల్గొన్నారు.