AP: ప్రజలు ఏమనుకుంటున్నారో అని జగన్ ఆలోచించడం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. తాను అనుకున్న ఓ ఊహా ప్రపంచంలో జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. మావిగన్ అందుకు ప్రత్యక్ష ఉదాహారణ అని చెప్పారు. మావిగన్ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశ ప్రజలూ నవ్వుకుంటున్నారన్నారు. తాను అనుకున్నదే ప్రజలూ అనుకుంటున్నారని ఊహించుకునే పరిస్థితి నుంచి జగన్ త్వరగా బయటకు రావాలని హితవు పలికారు.