అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో లేడీ డాన్ రంగమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలను ఎరగా వేసి అమాయకుల నుంచి ఈ ముఠా సుమారు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ముఠాకు సహకరించిన సీఐలు శ్రీహర్ష, రాజేంద్రనాథ్ యాదవ్ను ఇప్పటికే వీఆర్కు బదిలీ చేశారు. మరో ఎనిమిది మంది కానిస్టేబుళ్ల పాత్రపై విచారణ కొనసాగుతోంది.