సత్యసాయి: కదిరి వైసీపీ కార్యాలయంలో బీసీ గళం పోస్టర్ను నియోజకవర్గ సమన్వయకర్త బీయస్ మక్బూల్ గురువారం ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న అనంతపురంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. బీసీల హక్కుల కోసం గళం ఎత్తాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.