TPT: నాగలాపురం సురుటపల్లి గ్రామంలోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆదివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఈవో బీ.కే. వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించగా, దేవస్థానం పరిశుభ్రత, ప్రసాదాల నాణ్యతను ఈవో ప్రశంసించారు.