ఏఐటీయూసీ కాకినాడ జిల్లా నూతన కౌన్సిల్ 13 మందితో కార్యవర్గం ఎన్నిక అయ్యిందని ఏఐటీయూసీ నూతన ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ తెలిపారు. ఇవాళ కాకినాడలో పాత్రికేయుల సమావేశంలో ప్రసాద్ నూతన నాయకత్వాన్ని పరిచయం చేశారు. అధ్యక్షులుగా తాటిపాక మధు, ఉపాధ్యక్షులుగా కసింకోట కిషోర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్గా బొబ్బిలి శ్రీనివాసరావు నియమితులయ్యారని వెల్లడించారు.