GNTR: సామాజిక విప్లవయోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయాలను కొనసాగించడం ప్రభుత్వ ధ్యేయమని సీఎం పేర్కొన్నారు.