పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమతెరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రజలకు దోమతెరలను అందజేశారు. మలేరియా, డెంగ్యూ నివారణలో దోమతెరల వినియోగం ముఖ్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.